ఇతర మంత్రుల కంటే దుమ్మురేపుతున్న నానీ...!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రజల్లోకి వెళ్లి మాట్లాడే మంత్రులు చాలా తక్కువగా ఉన్నారు. ముగ్గురు నలుగురు మంత్రులు మినహా పెద్దగా ప్రజల్లోకి వెళ్లే వాళ్ళు తక్కువగానే ఉన్నారు. నానీ అందులో ఒకరు. ప్రజల్లోకి ఎప్పటికప్పుడు వెళ్తూ ప్రజల కష్టాలను తెలుసుకోవడం... అంతే కాకుండా స్థానిక నాయకుల ద్వారా సమాచారం సేకరించి గుడివాడలో ఎవరైనా సరే కరోనాతో ఇబ్బంది పడితే ఆసుపత్రి విషయంలో కూడా ఆయన చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. తన సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇస్తున్నారని అంటున్నారు.
అంతేకాకుండా వైద్య సేవలకు సంబంధించి కూడా సహకారం అందిస్తున్నారని ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల విషయంలో కూడా ఆయన చాలా సీరియస్ గా ఉన్నారని అంటున్నారు ప్రజలకు సేవ చేసే విషయంలో వైద్యులు కూడా ఇబ్బంది పడవద్దు అని వాళ్లకు అన్ని విధాలా అండగా ఉంటానని చెబుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల విషయంలో కూడా గుడివాడ నియోజకవర్గంలో కూడా కాస్త సీరియస్ గానే ఉన్నట్టుగా సమాచారం. ప్రైవేట్ ఆస్పత్రిలో ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలను ఆయన చేస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సి ఉంటుంది అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.