గుర్తులు వచ్చాకా బహిష్కరణ ఎలా సాధ్యం!
అయితే పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకున్నా.. అది ఎంతవరకు సాధ్యమనే చర్చ వస్తోంది. ఎందుకంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 2020 మార్చిలోనే నామినేషన్ల ప్రక్రి. ముగిసింది. నామినేషన్ల ఉప సంహరణలు కూడా ముగిశాయి. ఆయా స్థానాలకు అభ్యర్తుల లెక్క కూడా తేలింది. ఇప్పుడు టీడీపీ బహిష్కరించినా... ఆ పార్టీ తరపున నామినేషన్ వేసిన అభర్థుల విత్ డ్రా కుదరదు. టీడీపీ గుర్తులు కూడా బ్యాలెట్ పేపర్ లో ఉంటాయి. అంటే టీడీపీ పోటీ చేస్తున్నట్టే లెక్క. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ నిర్ణయం ఎలా వర్కవుట్ అవుతుందన్న చర్చ వస్తోంది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయించుకుందన్న వార్తలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. ఇప్పటివరకు నిమ్మగడ్డను అడ్డంపెట్టుకుని ఆటలు ఆడారని, ఇప్పుడు ఆ ఆటలు సాగవని తెలుసుకుని కొత్త నాటకానికి తెరదీశారని విమర్శించారు. అయినా ప్రజలు ఎప్పుడో టీడీపీని బహిష్కరించారని, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనం అని విమర్శించారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూడా టీడీపీపై వ్యాఖ్యలు చేశారు. మీదే ఆలస్యం, మిమ్మల్ని ప్రజలు ఎప్పుడో బహిష్కరించారని ఎద్దేవా చేశారు. ఎన్నికలను బహిష్కరిస్తే మీ పార్టీ బతకదు... లోకేశ్ బాబును బహిష్కరిస్తే ఫలితం ఉండొచ్చని వ్యాఖ్యానించారు.