ఆ పని చేస్తే జగన్ కు సలాం చేస్తా

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రజా ఉద్యమాలు చేయడానికి రెడీ అవుతుంది. తెలుగుదేశం పార్టీ నేతలు కాస్త స్పీడ్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఏపీలో ఈ మధ్య కాలంలో అత్యాచార ఘటనలు ఎక్కువగా జరగడం కూడా ఇప్పుడు ఇబ్బందిగా మారింది అనే చెప్పాలి. ఇక రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. 20 నెలల రాజారెడ్డి రాజ్యాంగo లో ఒక్క ఆడపిల్లను కాపాడుకోలేని పరిస్థితి నెలకొంది అని ఆమె ఆరోపించారు.
అనుషని హత్య చేసిన ప్రేమోన్మాది విష్ణువర్ధన్ రెడ్డి ని కఠినంగా శిక్షించాలి అని విజ్ఞప్తి చేసారు. నిందితుడు పక్కన రెడ్డి అని ఉంటే చాలు ఏం చర్యలు తీసుకోవాలన్న పోలీసులు భయపడుతున్నారని అన్నారు. రెడ్డి అని పక్కన తోక ఉంటే రాష్ట్రంలో ఏ అరాచకమైనా చేయవచ్చా అని నిలదీశారు. సాక్షి పేపర్లో మాత్రం రెడ్డి తీసేసి వార్త రాశారు అని ఆమె ఆరోపించారు. దిశా చట్టం ఒక దిక్కుమాలిన చట్టం అని మండిపడ్డారు. కనీసం దిశా చట్టం కూడా కరెక్టుగా తయారు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని వ్యాఖ్యలు చేసారు.
జగన్ ప్రభుత్వం లో మహిళల మానాలు,ప్రాణాలు రెండు పోతున్నాయి అని మండిపడ్డారు. ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ కన్నా ముందే జగన్ వస్తాడని ఉదరగొట్టారు అని ఎద్దేవా చేసారు. హోంమంత్రి ఒక "కీ" ఇస్తే ఆడే బొమ్మ మాత్రమే అని అన్నారు. ఆ బొమ్మకి సజ్జల లేదా జగన్ కీ ఇస్తేనే ఆడుతుంది అన్నారు. నరసరావుపేట కేసులో 21 రోజుల్లో నిందితుడుకి శిక్ష పడితే జగన్ కి సలాం చేస్తాం అన్నారు. ఒక విద్యారిని దారుణ హత్యకు గురైతే స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు కనీసం స్పందించడా అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: