'పోలీస్'పై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు..

Durga Writes
చలో ఆత్మకూరు, చలో అమరావతి అని డైరెక్టర్, నటుడు కలిసి డ్రామాలు చెయ్యడం కాదు.. ఇప్పుడు చూడు మీ టీడీపీ వాళ్ళే పోలీసులపై దాడులు చేశారు. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ఈ కామెంట్లకు కారణం విధుల్లో ఉన్న పోలీస్ పై టీడీపీ కార్యకర్తలు దాడి చెయ్యడమే కారణం.                                      

 

కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తేలప్రోలు గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపులో టీడీపీ నాయకులు చెలరేగిపోయారు. గ్రామంలోని వైసీపీ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకున్నాయి. ఘర్షణలో టీడీపీ వర్గం వాళ్ళు రాళ్లు విసిరారు.                                                 


దీంతో అక్కడే ఉన్న ఆత్కూరు ఎస్సై శ్రీనివాసరావుతో పాటు ఇద్దరు వైసీపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. టీడీపీ శ్రేణుల దాడులపై వైసీపీ నాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇక్కడ దాడి చేసింది టీడీపీ వాళ్ళు కానీ ఇది బాబు గారికి తెలిసిందంటే తప్పు అంత వైసీపీదే అంటారు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నిన్న చెలరేగిపోయిన విషయం తెలిసిందే..                    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: