'ఫిలిప్పీన్స్'లో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థి దుర్మరణం!

Durga Writes

ఎన్నో ఆశలు పెట్టుకొని.. జీవితాన్ని ఎంతో గొప్పగా ఉహించుకొని స్వదేశాన్ని వదిలి వెళ్లిన తెలుగు విద్యార్థి జీవితం ఓ రోడ్డు యాక్సిడెంట్ కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయింది.. ఫలితంగా కుటుంబసభ్యులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చాడు ఆ తెలుగు విద్యార్థి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫిలిప్పీన్స్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆ తెలుగు విద్యార్థి ఘోరంగా దుర్మరణం చెందాడు. 

 

కడప జిల్లా సిద్ధవటం మండలం ఉప్పర పల్లికి చెందిన మేరువ శ్రీహరి అనే విద్యార్థి రోడ్డు ప్రమాదంలో ఫిలిప్పీన్స్‌లో మృత్యువాత పడ్డాడు. శ్రీహరి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడంతో అతడు అక్కడిక్కడే మరణించాడు. శ్రీహరి మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. 

 

కాగా శ్రీహరి ప్రస్తుతం మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా శ్రీహరి మరణంతో వారి ఇంట విషాదం నెలకొంది.. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తమ కుమారుడి మృతుదేహాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సహకరించాలని శ్రీహరి తల్లితండ్రులు కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: