బాలయ్య- చిరులకు చెమటలు పట్టించిన ప్రభాస్.. కుంభస్థలాన్ని బద్దలు కొట్టాడుగా..!

Amruth kumar
రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఈశ్వర్ మూవీతో ప్రభాస్ టాలీవుడ్ లో అడిగి పెట్టాడు. మొదటి సినిమాతోనే భారీ ఫ్లాఫ్ అందుకున్న ప్రభాస్ రెండో సినిమాతో కూడా నిరాశపరిచాడు. అలా హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ మూడో సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేశాడు. ఆ సినిమా ఏమిటో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అదే వర్షం మూవీ.. ఈ సినిమాలో త్రిష హీరోయిన్.. ఒక లవ్ అండ్ యాక్షన్ మూవీగా ప్రేక్ష‌కుల‌ ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందే పాటలైతే సంచలనం సృష్టించాయి.
అ స‌మ‌యంలో ఎక్కడ చూసినా వర్షం మూవీ పాటలే వినిపించేవి దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. 2004 సంక్రాంతి సందర్భంగా జనవరి 14న  ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ మూవీ రిలీజ్ గురించి ప్రభాస్ గతంలో అన్ స్టాపబుల్ షో లో బాలయ్యతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వర్షం మూవీని ప్రొడ్యూసర్ ఎం ఎస్ రాజుగారు సంక్రాంతికి రిలీజ్ చేయాలని నాతో అన్నారు.. అప్పటికే మీరు నటించిన లక్ష్మీనరసింహ మెగాస్టార్ అంజి చిత్రాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.
దీంతో నేను రాజు గారితో చిరు- బాలయ్య మధ్యలో మన సినిమా వద్దు సార్ తర్వాత చూసుకుందాం అనిన చెప్పా. ఆయన వినుకొండ లేదు మనం రిలీజ్ చేయాల్సిందని అన్నారు. వెంటనే బాలయ్య మాట్లాడుతూ మీరు రాజులు కాద ఎవరి మాటా వినరంటూ సరదాగా పంచ్ వేశాడు. అలా మొత్తానికి వర్షం మూవీ రిలీజ్ చేసి బంపర్ హిట్ కొట్టావు కదా అని బాలయ్య ప్రశంసించాడు. తనకి దక్కిన  తొలి బ్లాక్ బస్టర్ వర్షం అని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. వర్షం సినిమాతో ప్రభాస్- గోపీచంద్ మంచి స్నేహితులగా మారారు. త్రిష కెరియర్ కూడా ఒక్కసారిగా మారిపోయింది. అలా ప్రభాస్ కెరియర్ లో వర్షం మూవీ మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమాతో పాటు విడుదలైన బాలయ్య లక్ష్మీనరసింహ సూపర్ హిట్గా నిలవగా చిరు అంజి సినిమాా ప్లాప్‌గా మిగిలిపోయింది. అలా కెరీర్ మొదట్లోనే చిరు- బాలయ్యకు చెమటలు పట్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: