అభిమానులకు మళ్లీ నిరాశ మిగిల్చిన మహేష్ బాబు.. ఏమైందంటే..?

Divya
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన మరి కొద్ది రోజుల్లో పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించుకోబోతున్నారు. అయితే ఇటీవల సర్కారు వారి పాట సినిమా తర్వాత ఆయన నుంచి ఏ ఒక్క సినిమా అప్డేట్ రాకపోవడం అభిమానులను తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ మాత్రం ఇప్పటివరకు మొదలు కాకపోవడమే గమనార్హం
నవంబర్ రెండవ వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని ప్రకటించారు. కానీ అది జరగలేదు. ఆ తర్వాత డిసెంబర్ 8 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని ప్రకటించారు. అది కూడా జరగలేదు. కనీసం డిసెంబర్ చివరివారానికన్నా షూటింగ్ ప్రారంభిస్తారు అని అనుకుంటుంటే.. మహేష్ బాబు మాత్రం వెకేషన్ కోసం ఫ్యామిలీతో యూకే వెళ్ళనున్నట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇప్పట్లో మహేష్ బాబు నుంచి సినిమా వచ్చే అవకాశాలు లేవని స్పష్టంగా తెలుస్తోంది.
ఏది ఏమైనా మహేష్ బాబు తన సినిమాలను ప్రకటించకపోవడంతో అభిమానులు పూర్తిస్థాయిలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా పూర్తి అయిన వెంటనే రాజమౌళితో తన తదుపరిచిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. మరి త్రివిక్రంతో వెకేషన్ నుంచి తిరిగి రాగానే షూటింగ్ ప్రారంభిస్తారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే మహేష్ బాబుకు ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదు. ఒకవైపు అన్న, తల్లి, తండ్రి అందరు మరణించడంతో ఒంటరి అయిపోయిన మహేష్ బాబు సినిమాలలో నటించడానికి కూడా ఆసక్తి చూపించడం లేదు.  అందుకే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్తున్నారు. వచ్చి రాగానే జనవరి చివరివారం కంతా  షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: