ఆ అదృష్టం తన కూతురికే దక్కింది అంటున్న ఐశ్వర్యరాయ్..?

Divya
మణిరత్నం దర్శకత్వంలో ఎంతో చారిత్రాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నీయన్ సెల్వన్. ఈ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం జరుగుతోంది. ఈ సినిమా ఈ నెల 30వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా చాలా వేగవంతం చేశారు చిత్ర బృందం . ఇక ఐశ్వర్య రాయ్ అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కు హాజరవ్వడం గమనార్హం. మణిరత్నం పై ఆమెకు గల గౌరవాన్ని కూడా తెలియజేయడం జరిగింది. మణిరత్నం సినిమాలలో నటించడం తనకి కొత్తేమి కాదని ఇదివరకు కూడా ఎన్నో సినిమాలలో నటించానని తెలిపింది.

మణిరత్నం గారు తెరకెక్కించే సినిమాలలో ఆమె పాత్ర ప్రాధాన్యం చాలా ఉంటుంది అని తెలియజేసింది. ఎన్నో సంవత్సరాలు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఐశ్వర్య రాయ్. ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు రావడానికి ముఖ్య కారణం మణిరత్నం గారి పైన ఉండే నమ్మకమే అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని ఒప్పుకోవడం ఒక విశేషం అయితే ఫ్రీ రిలీజ్ కూడా హాజరు కావడం మరొక విశేషం అని చెప్పవచ్చు.. మణిరత్నం గారి దర్శకత్వంలో నటించడం తన అదృష్టంగా తెలియజేసింది ఐశ్వర్య రాయ్.

ఐశ్వర్యరాయ్ మాట్లాడుతూ ఎవరికీ దక్కని అదృష్టం కుమార్తెకు మాత్రమే దక్కిందని ఒక ఆసక్తికరమైన విషయం తెలిపింది.. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒకరోజు తన కూతురు ఆరాధ్య సెట్ కి రావడం జరిగిందట. అయితే తను ఆ సెట్ లోకి వచ్చిన తర్వాత.. మరొక ప్రపంచంలా ఉండటం చూసి చాలా ఆశ్చర్యపోయిందని..తను అలా పరిసరాలను గమనిస్తూ.. డైరెక్టర్ మణిరత్నం గారు పిలిచి కేవలం ఒకే ఒక్క షాట్ తో ఆమెను చిత్రీకరించారని అది చూసి అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారని తెలిపింది. మణిరత్నం గారు ఎక్కువగా కట్ చెప్పే అవకాశం ఎవరికీ ఇవ్వరు. ఆయన కెరియర్ లో ఇప్పటివరకు ఇదే మొదటిసారి అని తెలియజేసింది ఎవరికీ తక్కువే అదృష్టం తన కూతురికి దక్కిందని తెలిపింది ఐశ్వర్యరాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: