ఆ అదృష్టం తన కూతురికే దక్కింది అంటున్న ఐశ్వర్యరాయ్..?
మణిరత్నం గారు తెరకెక్కించే సినిమాలలో ఆమె పాత్ర ప్రాధాన్యం చాలా ఉంటుంది అని తెలియజేసింది. ఎన్నో సంవత్సరాలు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఐశ్వర్య రాయ్. ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు రావడానికి ముఖ్య కారణం మణిరత్నం గారి పైన ఉండే నమ్మకమే అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని ఒప్పుకోవడం ఒక విశేషం అయితే ఫ్రీ రిలీజ్ కూడా హాజరు కావడం మరొక విశేషం అని చెప్పవచ్చు.. మణిరత్నం గారి దర్శకత్వంలో నటించడం తన అదృష్టంగా తెలియజేసింది ఐశ్వర్య రాయ్.
ఐశ్వర్యరాయ్ మాట్లాడుతూ ఎవరికీ దక్కని అదృష్టం కుమార్తెకు మాత్రమే దక్కిందని ఒక ఆసక్తికరమైన విషయం తెలిపింది.. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒకరోజు తన కూతురు ఆరాధ్య సెట్ కి రావడం జరిగిందట. అయితే తను ఆ సెట్ లోకి వచ్చిన తర్వాత.. మరొక ప్రపంచంలా ఉండటం చూసి చాలా ఆశ్చర్యపోయిందని..తను అలా పరిసరాలను గమనిస్తూ.. డైరెక్టర్ మణిరత్నం గారు పిలిచి కేవలం ఒకే ఒక్క షాట్ తో ఆమెను చిత్రీకరించారని అది చూసి అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారని తెలిపింది. మణిరత్నం గారు ఎక్కువగా కట్ చెప్పే అవకాశం ఎవరికీ ఇవ్వరు. ఆయన కెరియర్ లో ఇప్పటివరకు ఇదే మొదటిసారి అని తెలియజేసింది ఎవరికీ తక్కువే అదృష్టం తన కూతురికి దక్కిందని తెలిపింది ఐశ్వర్యరాయ్.