బ్రహ్మస్త్ర ను అస్సలు పట్టించుకోట్లేదుగా....?

murali krishna
సెప్టెంబర్ 9న విడుదల కాబోతున్న 'బ్రహ్మాస్త్ర' సినిమాకి మెల్లగా నే ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో ఎలాంటి సినిమా వచ్చినా..


అది డిజాస్టర్ అవుతుంది. కనీసపు ఓపెనింగ్స్ లేక నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారట. దీంతో ఇప్పుడు 'బ్రహ్మాస్త్ర'ను ఎలా ప్రమోట్ చేయాలో తెలియక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. అందుకే రిలీజ్ కు కేవలం ఇరవై రోజుల సమయమే ఉన్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో పబ్లిసిటీ హడావిడి కనిపించడం లేదు. ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలు విడుదలయ్యేప్పుడు దీనికి పోటీగా ఇతర సినిమాలు రావడానికి భయపడతాయి.


ఇక చిన్న సినిమాలైతే అలాంటి సాహసం  చేయాలని కూడా అనుకోవు. పైగా ఈ సినిమాకి సమర్పకుడిగా రాజమౌళి నే వ్యవహరిస్తున్నారు. దీంతో 'బ్రహ్మాస్త్ర'కి పోటీ ఉండదని భావించారు. కానీ అసలు ఈ సినిమా పట్టించుకుంటున్నట్లుగా కూడా లేరు మన హీరోలు. కిరణ్ అబ్బవరం నటించిన 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమా 'బ్రహ్మస్త్ర'కి పోటీగా రిలీజ్ కానుందట.. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఓకే అనిపించడంతో సినిమాపై మోస్టర్లు అంచనాలు ఏర్పడ్డాయి.


అయితే ఇదివరకు కిరణ్ అబ్బవరం నటించిన సినిమాలు ప్లాప్ కావడంతో.. ఆ ఎఫెక్ట్ ఈ సినిమాపై పడే ఛాన్స్ ఉంది. మరో నటుడు సత్యదేవ్ నటించిన సినిమా కూడా అదే రోజు రాబోతుంది. ఎప్పటినుంచో వాయిదాల మీద వాయిదాలు పడ్డ సత్యదేవ్ 'గుర్తుందా శీతాకాలం' సినిమా ఫైనల్ గా సెప్టెంబర్ 9న రిలీజ్ కానుందట.


ఇందులో తమన్నా హీరోయిన్ గా నటించింది. కన్నడ సినిమా 'లవ్ మాక్ టైల్'కి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలతో పాటు శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' సినిమా కూడా అదే డేట్ కి రాబోతుందట.ఈ ముగ్గురు హీరోలు 'బ్రహ్మాస్త్ర'తో పోటీ పడడానికి రెడీ అయ్యారంటే.. ఆ సినిమాను లైట్ తీసుకున్నట్లే  అని కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: