అన్నగారిని ఎదిరించి గెలిచిన ప్రముఖ నటుడు ఎవరో తెలుసా..?

Divya
తెలుగు చిత్ర పరిశ్రమలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించీ చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయన ఏకా చత్రాధిపత్యం చేస్తున్న రోజులలో ఆయన మాట ఎదిరించి నిలబడిన ఎవరూ కూడా ఇండస్ట్రీలో లేరంటే అతిశయోక్తి కాదు. దర్శక నిర్మాతలు కూడా ఎన్టీఆర్ ను ఎవరైనా ఎదిరించారని తెలిస్తే వారిని సినిమాలలో పెట్టుకోవడానికి కూడా ఆసక్తి చూపించేవారు కాదు. ఇక ఎన్టీఆర్ సినిమా విషయాలకు వస్తే మూడు షిఫ్ట్ లలో కూడా నిర్విరామంగా పనిచేసేవారు. ఇక కొన్ని సంవత్సరాలు ఎన్టీఆర్ చెప్పిందే వేదం అన్నట్టుగా ఉండేది ఆ రోజుల్లో.. కానీ కొన్ని సందర్భాలలో ఎన్టీఆర్ ను ఎదిరించి నిలిచిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ను ధిక్కరించి విజయం సాధించిన ఏకైక వ్యక్తి కమెడియన్ పద్మనాభం మాత్రమే అని చెప్పవచ్చు.
ఎన్టీఆర్ కంటే ఆర్థికంగా ఉన్న వ్యక్తి పద్మనాభం. అందుకే తన మొదటి ప్రొడక్షన్ లో ఎన్టీఆర్ తో సినిమా చేయాలని పద్మనాభం భావించాడు . కానీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఇక పద్మనాభం తన ప్రొడక్షన్లో మర్యాదరామన్న అనే ఒక కమెడియన్ కం హీరో పాత్రలో నటించి సినిమా తీశారు. ఆయన పేరు పైనే సొంత స్టూడియో ని కూడా కట్టించుకున్నారు. ఇక ఎన్టీఆర్ పద్మనాభంతో ఉన్న రూమును కాళీ చేసి టీ నగర్ లో సొంత ఇల్లు కొనుక్కొని సెటిల్ కాగా.. రాజబాబుతో కలిసి పద్మనాభం కొన్ని సంవత్సరాలు పాటు అదే అద్దే రూమ్లో గడిపారు. అంతేకాదు ఆయన చేసిన కమెడియన్ పాత్రలలో కూడా హీరోయిజం పండించడంలో పద్మనాభం వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.
ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా ఎన్టీఆర్ పద్మనాభం నిర్మాణంలో సినిమా తీయలేదు అనేది వాస్తవం. నిజానికి ఎన్టీఆర్కు కుదరలేదు అనేది కూడా అంతే వాస్తవం. అయితే ఈ విషయాన్ని దాచిపెట్టి పద్మనాభం తన సినిమాలో ఎన్టీఆర్ నటించడానికి ఒప్పుకోలేదు అనే విధంగా ప్రచారం చేయడం సాగించారు. ఎన్టీఆర్కు పద్మనాభంకు మధ్య గొడవలు కూడా మొదలయ్యాయి. అందుకే ఎన్టీఆర్  పద్మనాభంతో మాట్లాడడమే మానేశారు. కానీ పద్మనాభం మాత్రం ఎన్టీఆర్ ను ఎదిరించి తన సినిమాలలో దూసుకుపోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: