ఇక సెలవు.. అభిమానులకు షాకిచ్చిన రానా?

praveen
దగ్గుబాటి వారసుడు రానా గురించి.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కొడుకు గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇక తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. తన తండ్రి సురేష్ బాబు  నిర్మాతగా ఎంతలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడో.. నటుడిగా రానా కూడా అంతే మంచి పేరు సంపాదించుకున్నారు. ఏ పాత్ర చేసినా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి నటనతో ఆకట్టుకున్నాడు. రానా హీరోగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసాడు అన్న విషయం తెలిసిందే.

 దగ్గుబాటి రానా పర్ఫామెన్స్ చూసిన తర్వాత ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే అని చెప్పాలి. బాహుబలి సినిమాలో పవర్ఫుల్ విలన్ బల్లాల దేవుడి గా రానా నటించిన తీరును ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. మొన్న పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన భీమ్లా నాయక్ సినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. విరాటపర్వం సినిమాలో రానా పాత్రలో ఒదిగిపోయిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే గుణశేఖర్ తో హిరణ్యకశ్యప, మిలింద్ రావు తో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ఈ దగ్గుబాటి వారసుడు.

 అంతేకాదు తేజ దర్శకత్వంలో మరోసారి రానా మూవీ చేయబోతున్నాడు అంటూ ఒక ప్రచారం కూడా జరిగింది.  అయితే ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న రానా ఇటీవలే అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. ఇక పై సోషల్ మీడియాలో కనిపించను అంటూ బిగ్ బాంబు పేల్చాడు రానా. అయితే ఇది శాశ్వతంగా కాదని కేవలం సోషల్ మీడియా నుంచి చిన్న బ్రేక్ తీసుకుంటున్న అంటూ చెప్పాడు. పని జరుగుతూ ఉంది ఇప్పుడు సోషల్ మీడియా నుంచి కాస్త విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటున్న సినిమాలతో కలుద్దాం అంటూ రానా చేసిన పోస్ట్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి
.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: