'ఆహా' కోసం అల్లు అరవింద్ భారీ స్కెచ్.. ఏకంగా మెగాస్టార్ తో షో..?

Anilkumar
అల్లు అరవింద్ ఆధ్వర్యంలో సాగుతున్న ఆహా ఓటీటీ తెలుగు లో ఇప్పుడు  నెం.1 గా అతి త్వరలోనే వెళ్తుంది అంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అత్యధిక ఖాతాదారులు కలిగి ఉన్న ఓటీటీ ల జాబితాలో ఆహా ఉంది.ఇదిలావుంటే ఇక అతి త్వరలోనే ఆ స్థానం నెం.1 గా మార్చేందుకు గాను అల్లు అరవింద్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇకపోతే  నందమూరి బాలకృష్ణ తో అన్‌ స్టాపబుల్‌ అంటూ ఒక టాక్ షో ను చేయించడం ద్వారా సూపర్‌ హిట్‌ అయిన అల్లు అరవింద్‌ మరిన్ని సినిమాలు మరియు షో లను ఈ ఏడాది ఆహా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.

ఇదిలావుంటే ఇక ఆహా లో రాబోతున్న కంటెంట్ కోసం ముందు ముందు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూసే అవకాశాలు ఉన్నాయి. అయితే అందులో భాగంగానే మెగాస్టార్‌ చిరంజీవి తో అల్లు అరవింద్‌ ఒక అద్భుతమైన కార్యక్రమంను ఆహా ప్రేక్షకుల కోసం తీసుకు వచ్చే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.కాగా  చిరంజీవి తో అనగానే టాక్‌ షో అని అంతా అనుకుంటున్నారు. అయితే కాని అలా కాకుండా ఇప్పటి వరకు ఏ భాషలో లేని ఒక విభిన్నమైన షో ను అనుకుంటున్నారు.  ఇక ఒక ఇంగ్లీష్ ఛానల్‌ లో వస్తున్న ఆ కార్యక్రమంను తెలుగులో కాస్త మార్పులు చేసి ఆహా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని అంటున్నారు.

పోతే త్వరలోనే బాలయ్య అన్‌ స్టాపబుల్‌ షో సీజన్‌ 2 ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే.ఇదిలావుంటే  సీజన్ 2 యొక్క ప్రారంభ ఎపిసోడ్‌ లేదా చివరి ఎపిసోడ్‌ లో చిరంజీవి రావడం కన్ఫర్మ్‌ అయ్యింది. అయితే అంతే కాకుండా ఆహా కోసం చిరంజీవి స్పెషల్‌ గా షో ను చేయబోతున్నాడు.ఇక  ఎందుకంటే ఆహా లో చిరంజీవికి కూడా కొద్ది పాటి వాటా ఉందని.. ఇక అంతే కాకుండా భారీ పారితోషికం లేదా వాటాను పెంచే విషయం మై చిరంజీవితో చర్చలు జరుపుతున్నారని.. అయితే అందుకే ఆహా లో మెగా ఫ్యాన్స్ పాటు అందరికి పండుగ వంటి చిరంజీవి షో రాబోతుందని ఆహా టీమ్‌ నుండి సమాచారం అందుతోంది. ఇక ఇదే కనుక నిజం అయితే మెగా ఫ్యాన్స్ కు పండగే..!!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: