టాలీవుడ్ ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన మొట్టమొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న బుచ్చిబాబు సన గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సన ఈ సినిమా విడుదల అయ్యి చాలా కాలమే అవుతున్న ఇప్పటివరకు తన తదుపరి సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనలు మాత్రం విడుదల చేయలేదు. అప్పట్లో బుచ్చిబాబు తదుపరి సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
కాకపోతే ఇప్పటి వరకు ఆ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా టాలీవుడ్ స్టార్ దర్శకులలో ఒకరు అయిన సుకుమార్ మరియు బుచ్చిబాబు ఇద్దరూ ఒక చోట కూర్చొని ఏదో విషయం గురించి డిస్కషన్ చేస్తున్నట్లు ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం మన అందరికి తెలిసిందే. సుకుమార్ మరియు బుచ్చిబాబు ఇద్దరూ కలిపి పుష్ప ది రూల్ మూవీ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు అని, పుష్ప ది రూల్ స్క్రిప్ట్ పనుల్లో సుకుమార్ తో పాటు బుచ్చిబాబు కూడా పాల్గొంటున్నాడు అని వార్తలు వచ్చాయి.
అయితే ఆ వార్తలపై స్పందించిన బుచ్చిబాబు తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ... ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటో నేను తర్వాత చేయబోయే నా సినిమా కథ డిస్కషన్ కి సందర్భంలోనిది. మా గురువుగారు సుకుమార్ సార్ నా కోసం నా సినిమా కథ కోసం హెల్ప్ చేయడానికి వచ్చారు. సుకుమార్ సార్ సినిమా కథ లో కూర్చొని డిస్కషన్ చేసేంత స్థాయి నాకు లేదు ... రాదు. ఆయన నుండి నేర్చుకోవడం ... తీసుకోవడం , తప్ప ఆయనకు ఇచ్చే అంత లేదు. అంటూ ఒక పోస్టు ను సోషల్ మీడియాలో బుచ్చిబాబు చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.