ప్రాజెక్ట్ కె: ఫ్యాన్స్ కి పండగే.. అవేంజర్స్ రేంజట!

Purushottham Vinay
పాన్‌ ఇండియా స్టార్‌ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'ప్రాజెక్ట్ కె'. ఇక భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీపై సినిమా నిర్మాత అశ్వనీ దత్‌ కీలక ప్రకటన చేయడం జరిగింది.ఈ మూవీ గురించి ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ చెప్పారు. అదేంటంటే..ఈ భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీని 'అవెంజర్స్‌' తరహాలో తెరకెక్కిస్తున్నామని, ఇది పాన్‌ వరల్డ్‌ మూవీ అని ఆయన తెలిపారు. తాజాగా వైజయంతి మూవీస్ నిర్మించిన 'సీతారామం' సినిమా కూడా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే చిత్రయూనిట్‌ ప్రమోషన్స్‌ ని చేపట్టింది. ఈ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నిర్మాత అశ్వనీదత్‌ 'సీతారామం' మూవీ గురించి మాట్లాడిన తర్వాత 'ప్రాజెక్టు కె' సినిమా నుంచి బిగ్‌ అప్డేట్‌ ఇచ్చారు.ఇక ఇంటర్నేషనల్‌ మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని పాన్‌ వరల్డ్‌ స్థాయిలో మూవీని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.


ఈ ప్రాజెక్ట్‌ కె సినిమాకు సీక్వెల్‌ కూడా ఉండొచ్చన్నారు.'అవెంజర్స్‌' సిరీస్ తరహాలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సినిమాలో ప్రభాస్‌ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ సీనియర్ నటుడు బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ పాత్ర అయితే చాలా కొత్తగా ఉంటుందని చెప్పారు. ఇక ఈ మూవీ చూశాక సినీ ప్రేక్షకులు తప్పకుండా ఆశ్చర్యపోతారని చెప్పుకొచ్చారు. 2023 వ సంవత్సరం నాటికి చిత్రీకరణ పూర్తి చేసి 2024 వ సంవత్సరం జనవరిలో సినిమా విడుదల చేసేందుకు ప్లానింగ్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రిలీజ్ అవుతుందన్నారు.మహానటి ఫేమ్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న 'ప్రాజెక్ట్ కె' సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా భారీ సైన్స్ ఫిక్షన్ ఇంకా అలాగే ఫాంటసి థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: