గుణశేఖర్ హిరణ్యకశ్యప లైన్ లోనే ఉందా!!

P.Nishanth Kumar
చారిత్రాత్మక సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి అనడానికి ఇప్పటివరకు వచ్చిన చారిత్రాత్మక సినిమా ల ఫలితాలే నిరూపించబడ్డాయి. ఆ విధంగా భారీ సెట్ లతో ప్రేక్షకులను ఎంతగానో అబ్బురపరిచే దర్శకుడు గుణశేఖర్ చేసిన చారిత్రాత్మక సినిమా రుద్రమదేవి ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించింది. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో రానా మరియు అల్లు అర్జున్ కీలక పాత్రలు పోషించారు.

గుణశేఖర్ భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తాడే కానీ సక్సెస్లు అందుకోలేక పోతున్నాడు అని వస్తున్న విమర్శలకు ఈ సినిమా సమాధానం చెప్పింది.  అలా ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్ల పరంగా అనుకున్నంత వసూలు రాలేదు. గుణశేఖర్ ఆ తర్వాత సినిమా చేయడానికి చా లా సమయం తీసుకున్నాడు. అలా చేసిన శాకుంతలం సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని చాలా రోజులే అవుతున్న ఇంకా విడుదల కాకపోవడం ఆ సినిమాపై ఎన్నో అనుమానాలను రెట్టింపు చేస్తుంది. 

అయితే రుద్రమదేవి సినిమా చేస్తున్న సమయంలోనే ఆయన హిరణ్యకశ్యప అనే సినిమా చేయాలని భావించాడు.  రా ణా ప్రధాన పాత్రలో ఈ సినిమా చేయాలని భావించాడు . ఈ సినిమాకు సంబంధించి  అప్పట్లో ఎన్నో వార్తలు వినిపించాయి అయితే ఆ చిత్ర బడ్జెట్ కు రానాకు ఉన్న మార్కెట్ కు సరితూగకపోవడంతో ఈ చిత్రాన్ని ఆపేయవలసి వచ్చింది.  ప్రస్తుతం రానా మంచి మార్కెట్ కలిగి ఉన్నాడు. బాహుబలి సినిమా తర్వాత ఆయనకు మంచి బడ్జెట్ పెట్టి సినిమాలు చేసే నిర్మాతలు ముందుకు వస్తు న్నారు.  ఈ నేపథ్యంలో ఇప్పుడు చేస్తున్న సినిమాలతో పాటుగా హిరణ్య కశ్యప అనే భారీ బడ్జెట్ సినిమా కూడా ఆయన చేయవచ్చు అని అంటున్నారు. మరి శకుంతలం సినిమాను విడుదల చేసిన తర్వాత గురు శేఖర్ అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: