మారుతి చుట్టే పక్కా కమర్షియల్ ప్రమోషన్స్..!!

P.Nishanth Kumar
మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పుడు జోరుగా జరుగుతున్నాయి. జూలై ఒకటవ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రం పై ప్రేక్షకులలో మంచి అంచనాలే నెలకొన్నాయి. దాంతో ఈ సినిమాను అందరికీ చేరవేసేలా ప్రమోషన్ నిర్వహిస్తోంది చిత్రబృందం. గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమా లో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఈ చిత్రం లో ఇద్దరు లాయర్ లు గా నటిస్తున్నారు.

గత కొన్ని సినిమాలుగా సక్సెస్ లేకుండా బాధపడుతున్న గోపీచంద్ కు ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఆయన గత సినిమా సీటీ మార్ తో గోపీచంద్ ఆయన స్థాయిలో మాస్ ప్రేక్షకులను అలరించలేకపోయింది. దాంతో ఈ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకోవాలని ఆయన భావిస్తున్నాడు. అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో వేచి చూస్తున్నాడు. ఇక దర్శకుడు మారుతి సినిమాల గురించి అందరికీ తెలిసిందే. అయన సినిమాల్లో మంచి కామెడి తో పాటు కథ కూడా ఉంటుంది. ఎమోషన్స్ కి పెద్ద పీత వేస్తూ ఉంటాడు దర్శకుడు మారుతి. 

ఆయన సినిమాలన్నీ కూడా ఓ మోస్తరు విజయాన్ని అందుకుంటూ వుంటాయి. ఆ విధంగా ఈ సినిమా తప్పకుండా మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా కాబట్టి భారీ విజయాన్ని అందుకోవడం ఖాయం అని ఆయన అభిమానులు భావిస్తున్నారు. చిన్న సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు మారుతి ఇప్పుడు పెద్ద హీరోలతో సినిమాలు చేసే స్థాయికి ఎదగగా ఈ దర్శకుడు ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా ద్వారా భారీ విజయాన్ని అందుకోవడం ఖాయం అని చెబుతున్నారు. మరి గోపీచంద్ కు ఇటు రాశీ కన్నా కు ఇద్దరికీ మంచి విజయం సాధించవలసిన నేపథ్యంలో మారుతి ఈ చిత్రానికి ఏ స్థాయిలో విజయం అందుకునేలా చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: