ఎన్టీఆర్... ప్రశాంత్ నీల్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో 31 వ సినిమా గా తెరకెక్కే బోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసింది.

అందుకు సంబంధించి చిత్ర బృందం ఒక పోస్టర్ ను కూడా విడుదల చేయగా,  ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా 'కే జి ఎఫ్' మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇలా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ వున్న ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుంది అనగానే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు మాములు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.  ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఇలా ప్రస్తుతం వీరిద్దరు కమిట్ అయిన సినిమాలు పూర్తి కాగానే ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే  సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే... ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించబోయే సినిమాలో ద్విపాత్రాభినయం లో కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: