పవన్ మూవీలో సాయి తేజ్ నిజ జీవిత సంఘటన..?

Anilkumar
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయితేజ్ కాంబినేషన్ లో వినోదాయ సిత్తం రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే సముద్రఖని డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.అయితే జులై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇదిలా ఉంటె ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.అంతేకాకుండా  కొన్ని నెలల క్రితం యంగ్ హీరో సాయితేజ్ యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే.అయితే బైక్ పై వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చాలామంది భావించారు.

కాగా  వినోదాయ సిత్తం రీమేక్ లో కూడా ఇలాంటి సీన్ ఉంది.అయితే  ఒరిజినల్ లో కారులో ప్రమాదం జరిగినట్టు చూపించగా రీమేక్ లో మాత్రం బైక్ పై వెళుతున్న సమయంలో ప్రమాదానికి గురైనట్టు చూపించనున్నారని సమాచారం అందుతోంది.ఇకపోతే  ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భగవంతుడిగా కనిపించనున్నారు.కాగా  వినోదాయ సిత్తం రీమేక్ కు సంబంధించి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కీలక మార్పులు చేశారు.ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి త్రివిక్రమ్ తన పేరును వేసుకుంటారో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

కాగా ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక త్రివిక్రమ్ భార్య కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకోనున్నారు.పోతే  పవన్ రీఎంట్రీలో వరుస విజయాలను సొంతం చేసుకుంటుండగా ఈ సినిమాతో పవన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అంతేకాదు నటుడిగానే కాకుండా దర్శకునిగా కూడా సముద్రఖనికి మంచి గుర్తింపు ఉంది.ఇకపోతే  సముద్రఖని తన తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఐరహే ఈ సినిమా షూటింగ్ త్వరగానే పూర్తవుతుందని వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని సమాచారం అందుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: