మ్యాచో స్టార్ గోపిచంద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.అయితే గోపిచంద్ గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న విషయం మనకి తెలిసిందే.ఇదిలావుంటే తాజాగా గోపిచంద్ ఎలాగైనా హిట్ కొట్టాలని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో సినిమా చేశాడు. ఇకపోతే గోపిచంద్, మారుతి కాంబోలో తెరకెక్కిన సినిమా 'పక్కా కమర్షియల్'. ఈ సినిమాలో గోపిచంద్ కి జోడిగా రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 1న విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇకపోతే సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడిన నేపథ్యంలో మేకర్స్ సినీ అభిమానులకు ఓ శుభవార్త అందించారు.ఇదిలావుంటే తాజాగా గోపిచంద్ రాశీఖన్నా నటించిన పక్కా కమర్షియల్ సినిమా టిక్కెట్ రేట్లను తాజాగా మేకర్స్ ప్రకటించారు.అయితే తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ థియేటర్లో ఒక్కో టికెట్ ధర రూ.100 కాగా.. మల్టీప్లెక్స్లో రూ.160గా ఉండునుంది. ఇక అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ థియేటర్లో రూ.100 కాగా.. మల్టీప్లెక్స్లో రూ.150గా ఉండనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ఇటీవలి కాలంలో ఇంత తక్కువ టిక్కెట్ రేట్లతో ఏ సినిమా విడుదల కాలేదు.
ఇక దాంతో సినీ,గోపిచంద్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే గోపిచంద్ పక్కా కమర్షియల్ సినిమాను యూవీ క్రయేషన్స్, జీఎ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నివాస్, వంశీ, ప్రమోద్లు సంయుక్తంగా నిర్మించారు.పోతే ఈ చిత్రంలో సత్యరాజ్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. కాగా జేక్స్ బేజోయ్ సంగీతం అందించిన పాటలు బాగున్నాయి. ఇక గోపిచంద్, మారుతి కాంబో కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలావుంటే గోపిచంద్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్లో జరుగనుంది. అంతేకాక ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు.ఇక దీంతో మెగాస్టార్ గోపీచంద్ అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..!!