బాలయ్య అభిమానులకు పూనకాలే అంటున్న డైరెక్టర్..!!

Divya
నందమూరి బాలకృష్ణ గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ కోసం ఎదురు చూశారు అలాంటి సమయంలో గత సంవత్సరం మాస్ చిత్రంగా తెరకెక్కించిన సినిమా అఖండ రూపంలో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బోయపాటి శ్రీను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. దీంతో బాలకృష్ణ మరింత రెట్టింపు ఉత్సాహంతో తదితర సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక అఖండ చిత్రం తర్వాత.. మరొక యాక్షన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమా నిర్మిస్తున్నది.

ఇక కొద్ది రోజుల క్రితం ఫస్ట్ ఎటాక్ పేరుతో ఇటీవలే ఈ మూవీ టీజర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ లో బాలయ్య సాలిడ్ పర్ఫార్మెన్స్ లుక్ లో అదరగొట్టారు అని చెప్పవచ్చు. బాలకృష్ణ ఈ చిత్రంలో కూడా ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు గా తెలుస్తోంది. బాలకృష్ణ ఈ టీజర్లో ప్రజెంటేషన్ చేసిన తీరు ఆయన అభిమానులకు పూనకాలు తెప్పించే విధంగా ఉన్నది. ఇందులో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
ఇక ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగ ఈ చిత్రం తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక మాస్ మసాలా, యాక్షన్ సినిమాలో నటించబోతున్నారు. ఇక వీటితో పాటే అన్ స్టాపబుల్-2 కు సిద్ధమవుతున్నారు. ఎఫ్ త్రీ ప్రమోషన్లలో డైరెక్టర్ వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం తాజాగా బాలకృష్ణ సంబంధించి ఒక వార్త వైరల్ గా మారుతుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ 50 ఏళ్లు దాటిన వ్యక్తిగా ఒక యువతికి తండ్రిగా పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు తెలుస్తోంది మరొకరు మాత్రం పోలీస్ ఆఫీసర్ గా కూడా కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ పాత్రల్లో బాలకృష్ణ సరికొత్త మేక్ఓవర్ ని చూడవచ్చు ఉన్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: