యోగాసనాలు చేస్తున్న మంచు లక్ష్మీ..

Satvika
నేడు అంతర్జాతీయ యోగా డే ను పురష్కరించుకొని దేశ వ్యాప్తంగా పలు కార్యక్రామాలను నిర్వహించారు. యోగా పట్ల తమకు ఉన్న అనుభంధాన్ని సినీ, రాజకీయ ప్రముఖులు పంచుకున్నారు..యోగా నిత్యం చెయ్యడం వల్ల కలిగే లాభాలా గురించి అభిమానుల తో పంచుకున్నారు.అంతే కాదు వాళ్ళు యోగాలు చేస్తున్న వీడియోలను ,ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. కర్ణాటకలోని మైసూరు కోటలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

యోగా ఫర్ హ్యుమానిటీ' పేరుతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. భారత వైవిద్యాన్ని, ప్రత్యేకతను యోగా ప్రతిబింబిస్తుందని అన్నారు. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సహాకారంతో యోగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తమైందని అన్నారు. యోగాను గుర్తించినందుకు ఐక్యరాజ్యసమితికి ప్రధాని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు..మంచు లక్ష్మీ కూడా యోగా డే సందర్భంగా యోగసనాలు చేసింది. మంచు లక్ష్మీని చూసి నెటిజన్స్ థ్రిల్ అవుతున్నారు. అంతేకాక మంచు లక్ష్మీ టాలెంట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మంచు మోహన్ బాబు నటవారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటి మంచు లక్ష్మి. అమెరికాలో చదువుకున్న మంచు లక్ష్మి అక్కడే హాలీవుడ్ సీరియల్స్ లో నటించింది. ఆ తరవాత ఇండియాకు షిఫ్ట్ అయ్యింది.
తెలుగు లో టీవీ షోలు చేస్తూ, మరోవైపు సినిమాలను కూడా చేసింది.అంతే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలు చేసింది చేస్తోంది.

మంచు లక్ష్మి అనగనగా ఒక ధీరుడు సినిమాతో ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన చాలా విషయాల్ని ఆమె.. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఆమె సొంతంగా ఓ యూట్యూబ్‌ చానల్‌ కూడా ఉంది. యూట్యూబ్‌ వేదికగా తరచూ హోంటూర్స్‌, ఇంట్లో సెలబ్రెషన్స్‌కు సంబంధించిన వీడియోలను పంచుకుంటూ ఉంటుంది.సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు వీడియోలను షేర్ చేస్తూ వస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: