యోగాసనాలు చేస్తున్న మంచు లక్ష్మీ..
యోగా ఫర్ హ్యుమానిటీ' పేరుతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. భారత వైవిద్యాన్ని, ప్రత్యేకతను యోగా ప్రతిబింబిస్తుందని అన్నారు. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సహాకారంతో యోగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తమైందని అన్నారు. యోగాను గుర్తించినందుకు ఐక్యరాజ్యసమితికి ప్రధాని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు..మంచు లక్ష్మీ కూడా యోగా డే సందర్భంగా యోగసనాలు చేసింది. మంచు లక్ష్మీని చూసి నెటిజన్స్ థ్రిల్ అవుతున్నారు. అంతేకాక మంచు లక్ష్మీ టాలెంట్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మంచు మోహన్ బాబు నటవారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటి మంచు లక్ష్మి. అమెరికాలో చదువుకున్న మంచు లక్ష్మి అక్కడే హాలీవుడ్ సీరియల్స్ లో నటించింది. ఆ తరవాత ఇండియాకు షిఫ్ట్ అయ్యింది.
తెలుగు లో టీవీ షోలు చేస్తూ, మరోవైపు సినిమాలను కూడా చేసింది.అంతే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలు చేసింది చేస్తోంది.