మహేష్ కోసం జక్కన్న భారీ ప్లాన్..!
మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీగా రాబోతున్న పాన్ ఇండియా చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి తనదైన మార్క్ మూవీగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల జక్కన్న కూడా ఆర్ఆర్ఆర్ సక్సెస్తో వెకేషన్కు వెళ్లి, తాజాగా తిరిగి వచ్చాడు. ఇక ప్రస్తుతం మహేష్ సినిమా కోసం స్క్రిప్టు పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను అడవి నేపథ్యంలో సాగే కథతో తీయబోతున్నాడట జక్కన్న. అందుకు తగ్గట్టుగానే భారీ బడ్జెట్తో ఈ సినిమాను భారీ క్యాస్టింగ్తో రూపొందించనున్నాడు.కాగా, ఈ సినిమాలో మహేష్ బాబును ఎప్పుడూ చూడని విధంగా చూపించనున్నారు.
మహేష్ బాబును ఢీకొనే విలన్ పాత్ర కూడా చాలా పవర్ఫుల్గా తీర్చిదిద్దాలని రాజమౌళి అనుకుంటున్నాడట. అందుకోసం ఈ సినిమాలో విలన్గా నటించే యాక్టర్ను సౌత్ నుండి కాకుండా బాలీవుడ్ నుండి దించేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడట. బాలీవుడ్లో మంచి ఫేం ఉన్న స్టార్ యాక్టర్ను మహేష్ సినిమా కోసం విలన్గా తీసుకురాబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఇంకా ఈ సినిమా స్క్రిప్టు పనులే పూర్తి కాలేదు, అప్పుడే నటీనటుల విషయం సోషల్ మీడియాలో వినిపిస్తుండటంతో ఈ సినిమాపై జనాల్లో ఆసక్తి రోజు రోజుకు పెరుగుతుంది. మరి ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..