ప్రేక్షకులు నన్ను క్షమించాలంటున్న కమల్ హాసన్..!

shami
కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా విక్రం జూన్ 3న భారీ రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో కమల్ జోరుగా పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే తన సినిమా రావడానికి నాలుగేళ్లు గ్యాప్ వచ్చిందని అందుకు ప్రేక్షకులు తనని క్షమించాలని అన్నారు. ఇక మీదట వరుస సినిమాలు చేస్తానని చెప్పారు కమల్ హాసన్. మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేతగా ప్రజల కోసం శ్రమిస్తున్న కమల్ హాసన్ ఇక మీదట అదే ప్రజల కోసం పెట్టుబడి పెడతానని అన్నారు.
తనకు ఇండస్ట్రీ చాలా ఇచ్చిందని అందుకే పరిశ్రమలోనే పెట్టుబడి పెడుతున్నానని.. ఇక మీదట ప్రజల కోసం కూడా పెట్టుబడి పెడతానని చెప్పారు కమల్ హాసన్. కరుణానిధి జయంతి నాడు విక్రం సినిమా రిలీజ్ అవడం యాదృశ్చికమే అని అన్నారు కమల్. తనకు ఇష్టమైన నాయకుడు కరుణానిధి అని చెప్పారు. లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో విక్రం 3 సినిమా చేసేందుకు కూడా తాను సిద్ధం గా ఉన్నానని అన్నారు కమల్ హాసన్.
విక్రం సినిమాలో కమల్ హాసన్ తో పాటుగా విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కూడా నటించారు. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా తమిళంతో పాటుగా తెలుగు, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. ప్రచార చిత్రాలతో విక్రం సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింద్ది సినిమాలో కమల్ చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. విక్రం సినిమాను తెలుగులో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి రిలీజ్ చేస్తున్నారు. కమల సినిమా అంటే ఇక్కడ స్టార్ సినిమాల రేంజ్ ఉంటుంది. తెలుగులో కమల్ హాసన్ కి కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈమధ్య సినిమాలకు గ్యాప్ రావడంతో కమల్ హాసన్ సినిమాకు ఆశించిన స్థాయిలో బజ్ ఏర్పడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: