బాలీవుడ్ ప్రేక్షకులు కొత్తదనం కోసం ఎదురుచూస్తున్నారా..!!

Divya
బాలీవుడ్ లో ఒకప్పుడు హిందీ సినిమాలు కొన్ని వందల కోట్ల రూపాయలను వసూలు చేస్తూ ఉండేవి. సౌత్ సినిమా మేకర్స్ కు బాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకర్షితులయ్యారు. ప్రస్తుతం ఎక్కువగా సౌత్ సినిమాల వైపు దృష్టి పెడుతున్నారు బాలీవుడ్ ప్రేక్షకులు. ఇక దీంతో బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలు విడుదల అయ్యి మంచి విజయాలను అందించాయి. కానీ బాలీవుడ్లో విడుదలైన సినిమాలు మాత్రం వరుసగా నిరాశ పరుస్తూనే ఉన్నాయి. ఇక తెలుగు సినిమాలు ఇతర భాషలలో కూడా మంచి కలెక్షన్లను రాబడుతూ ఉన్నాయి.
ముఖ్యంగా తెలుగు సినిమాలలో ఉండే కొన్ని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఎంజాయ్ చేసేలా చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో విడుదలైన తెలుగు సినిమాలు బాలీవుడ్లో మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇందుకు కారణం బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టుగా ఫిలింమేకర్ లు ఆ సినిమాలను చిత్రీకరించడమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఒకప్పుడు బాలీవుడ్ లో కేవలం లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది.. సౌత్ సినిమా లకు ఉత్తర భారత దేశంలో అంతగా క్రేజ్ ఉండేది కాదు. కానీ ప్రస్తుతం బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది అని చెప్పవచ్చు.
ఎక్కువగా బాలీవుడ్ ప్రేక్షకులు మాస్ సినిమాలు , యాక్షన్ సినిమాలు ఇష్టపడుతున్నారు. ప్రేక్షకులు మారినప్పటికీ ఫిలిం మేకర్స్ మాత్రం బాలీవుడ్లో మారలేదు. వారు మునుపటిలా గానే పాత సినిమాలను తీస్తూ ప్రేక్షకులకు బోరింగ్గా అయ్యేలా చేస్తూ ఉన్నారు. అందుచేతనే సౌత్ సినిమాల పైన బాలీవుడ్ ప్రేక్షకులు చాలా మోజు పడుతున్నారు. ఇక ఇటీవల కాలంలో బాలీవుడ్ స్టార్స్ కొంతమంది మాట్లాడడం కూడా జరిగింది. మరికొంతమంది కూడా బాలీవుడ్లో మాస్ సినిమాలను చేయలేకపోతున్నారు అంటూ వార్తలు  కూడా వినిపిస్తున్నాయి. అయితే బాలీవుడ్లో కేవలం కొంతమంది దర్శకుల ఇలాంటి చిత్రాలను తెరకెక్కించే వారు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: