రామ్ చరణ్ ను విలన్ చేసారంటూ థియేటర్ లో ఏడ్చేసిన బాలుడు.. వైరలవుతున్న వీడియో..!

Anilkumar
రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం భావోద్వేగాల సమాహారం అని సినిమా విడుదలకు ముందే ప్రమోషన్స్‌లో డైరెక్టర్, హీరోలు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.అయితే ఈ సినిమా శుక్రవారం విడుదలైన ఫిల్మ్ చూసి ప్రేక్షకులు కూడా అదే అంటున్నారు. ఇకపోతే పిక్చర్ చూసి ప్రతీ ఒక్కరు ఎమోషనల్ అవుతున్నారు.ఇక  ముఖ్యంగా హీరోలిద్దరూ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల పర్ఫార్మెన్స్ చూసి ఫిదా అవుతున్నారు.ఇదిలా ఉండగా సినిమా స్టోరిలో భాగంగా స్నేహితులుగా నటించిన రామ్ చరణ్, తారక్ ఒకానొక సందర్భంలో ఫైట్ చేసుకున్నపుడు చూస్తే ప్రతీ ఒక్కరు కంట నీళ్లు పెట్టుకుంటారని 'ఆర్ఆర్ఆర్' స్టోరి రైటర్ విజయేంద్రప్రసాద్ చెప్పారు.


అయితే ఇప్పుడు అది నిజమవుతోంది కూడా. ఇకపోతే అసలు విషయంలోకి వెళితే ఈ సినిమాను  చూసిన ఓ పదేళ్లా బాలుడు.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కొట్టుకోవడం చూసి ఏడ్చేశాడు. కాగా థియేటర్‌లో ఇంటర్వల్ సీన్ చూసి బోరున ఏడ్చేశాడు.అయితే సినిమాలో రామ్ చరణ్‌ను తారక్ కొడుతుంటే చూడలేక బోరుమని ఏడ్చాడు ఆ బాలుడు. ఇక అది చూసిన బాలుడి కుటుంబ సభ్యులు అది సినిమాని, వారిరువురు నెక్స్ట్ ఫ్రెండ్స్ అయితారని ఓదార్చారు. అయితే అలా చెప్పినప్పటికీ బాలుడు మాత్రం అసహనం వ్యక్తం చేశాడు. కాగా అనవసరంగా రామ్ చరణ్‌ను విలన్ చేశారంటూ రోదించాడు.


అయితే ఇదంతా వీడియో రికార్డు చేసి ఒకరు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా, అది ప్రస్తుతం తెగ వైరలవుతోంది. అంతేకాదు యూట్యూబ్‌లోనూ ఈ వీడియో అప్ లోడ్ చేయగా, అది చూసి నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఇకపోతే రాజమౌళి సినిమాలో ఎమోషన్స్ ఎలివేషన్స్ అలా ఉంటాయని, ప్రతీ ఒక్కరు ఆ సీన్స్ కనెక్ట్ అవుతారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక మరో వైపు విడుదలైన ఒక్కరోజులోనే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్ల కలెక్షన్స్ ని అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 223 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని అందుకున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది.ఇక ఈ కలెక్షన్స్ తో టాలీవుడ్ లో బాహుబలి2 పేరిట ఉన్న రికార్డును సైతం త్రిబుల్ ఆర్ బ్రేక్ చేసింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR

సంబంధిత వార్తలు: