అబ్బా : మహేష్ ఫ్యాన్స్ కి ఆ రెండు రోజులు పండగేనబ్బా .... ??

GVK Writings
సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి సినిమా వచ్చి ఎప్పుడో రెండేళ్లు కానుండడంతో ఆయన ఫ్యాన్స్ లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పరశురామ్ పెట్ల తీస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్, 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ వారు దీనిని ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా సముద్రఖని విలన్ గా చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం తనకు కరోనా పాజిటివ్ రావడంతో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్న మహేష్ బాబు, మరికొన్నాళ్ల తరువాతనే సర్కారు వారి పాట తదుపరి షూట్ లో జాయిన్ కానున్నట్లు సమాచారం. ఇక రెండేళ్ళైనా మహేష్ నుండి సినిమా రాకపోవడం మరోవైపు సర్కారు వారి పాట ఫస్ట్ సాంగ్ ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తాం అని చెప్పిన యూనిట్, తమ టీమ్ లో కొందరికి కరోనా సోకడంతో సాంగ్ అప్ డేట్ కి మరికొంత సమయం పడుతుందని ఇటీవల తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలిపింది. దీనితో మహేష్ ఫ్యాన్స్ అందరూ తీవ్ర నిరాశలో ఉండిపోయారు.
అయితే వారందరికీ మంచి జోష్ నిస్తూ ఫిబ్రవరి లో మొత్తంగా రెండు సర్ప్రైజ్ లు వారిని ఖుషి చేయనున్నాయట. ముందుగా బాలయ్యతో మహేష్ బాబు పాల్గొన్న అన్ స్టాపబుల్ షో యొక్క స్పెషల్ ఎపిసోడ్ ని ఫిబ్రవరి 4న ప్రసారం చేస్తున్నట్లు ఆహా వారు ప్రకటించారు. అలానే సర్కారు వారి పాట మూవీ నుండి ఫస్ట్ సాంగ్ ఫిబ్రవరి 14న లవర్స్ డే సందర్భంగా రిలీజ్ కానున్నట్లు చెప్తున్నారు. ఈ విషయమై నిన్న థమన్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా చిన్న హింట్ కూడా ఇచ్చారు. మరి ఇదే కనుక నిజం అయితే మొత్తంగా ఫిబ్రవరిలో ఈ రెండింటితో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: