వర్మ : ధనుషైనా..ఎవ్వడైనా నా దారిలోకి రావాల్సిందే..?
అయితే వీరు ఎందుకు విడిపోయారు అనే విషయం తెలుసుకోవడానికి అటు ప్రేక్షకులు , ఇటు సినీ సెలబ్రిటీలు సైతం ఆత్రుతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ జంట ను ఉద్దేశించి భిన్నంగా వర్మ చేసిన ట్వీట్ తాజాగా వైరల్ గా మారింది.. వర్మ ఇలా ట్వీట్ చేస్తూ.. పెళ్లి అనేది ఎంత ప్రమాదమో హెచ్చరించడానికి తారల విడాకులే ఒక ట్రెండ్ సెట్టర్.. స్మార్ట్ పీపుల్స్ లవ్ చేస్తారు.. మూర్ఖులే వివాహం చేసుకుంటారు..అంతే కాకుండా సంతోషంగా ఉండడానికి రహస్యం ఏమటంటే పెళ్లి అనే జైలుకు వెళ్లడం కంటే వీలైనంతవరకు ప్రేమించడమే ఉత్తమం.. అంటూ వరుస ట్వీట్లు వర్మ చేశారు.
ఇకపోతే వర్మ తన భార్య నుంచి విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే.. కాబట్టి ఇక ఎవరైనా సరే నా దారిలోకి రావాల్సిందే అంటూ ట్వీట్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇప్పటికే నాగచైతన్య- సమంత ,ధనుష్ - ఐశ్వర్య బ్యూటిఫుల్ కపుల్స్ గా గుర్తింపు తెచ్చుకొని విడాకులు తీసుకున్నారు. ఇక త్వరలోనే శ్రీజ - కళ్యాణ్ దేవ్ కూడా వివాహబంధానికి దూరం కాబోతున్నారు.