వర్మ : ధనుషైనా..ఎవ్వడైనా నా దారిలోకి రావాల్సిందే..?

Divya
రామ్ గోపాల్ వర్మ.. సినీ ఇండస్ట్రీలో ఏం జరిగినా సరే విభిన్నంగా స్పందించడం ఆయన స్టైల్ అని చెప్పవచ్చు.. అందరిలా ప్రవర్తిస్తే ఆయన వర్మ అవలేడు కాబట్టి.. అందరికీ విభిన్నంగా..విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. వార్తల్లో నిలుస్తూ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాడు.. ఇక తాజాగా ఆయన చేసిన ట్వీట్లు కూడా ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.. ఎందుకంటే తాజాగా కోలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ , ఆయన భార్య, ప్రముఖ దర్శకురాలు ఐశ్వర్య దాదాపు 18 సంవత్సరాల క్రిందట 2004లో నవంబర్ 18వ తేదీన ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గత రాత్రి హీరో ధనుష్ ఐశ్వర్య నుంచి విడాకులు తీసుకున్నాను అని అధికారికంగా ప్రకటించారు.

అయితే వీరు ఎందుకు విడిపోయారు అనే విషయం తెలుసుకోవడానికి అటు ప్రేక్షకులు , ఇటు సినీ సెలబ్రిటీలు సైతం ఆత్రుతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ జంట ను ఉద్దేశించి భిన్నంగా వర్మ చేసిన ట్వీట్ తాజాగా వైరల్ గా మారింది.. వర్మ ఇలా ట్వీట్ చేస్తూ.. పెళ్లి అనేది ఎంత ప్రమాదమో హెచ్చరించడానికి తారల విడాకులే ఒక ట్రెండ్ సెట్టర్.. స్మార్ట్ పీపుల్స్ లవ్ చేస్తారు.. మూర్ఖులే వివాహం చేసుకుంటారు..అంతే కాకుండా సంతోషంగా ఉండడానికి రహస్యం ఏమటంటే  పెళ్లి అనే  జైలుకు వెళ్లడం కంటే వీలైనంతవరకు ప్రేమించడమే ఉత్తమం.. అంటూ వరుస ట్వీట్లు వర్మ చేశారు.

ఇకపోతే వర్మ తన భార్య నుంచి విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే.. కాబట్టి ఇక ఎవరైనా సరే నా దారిలోకి రావాల్సిందే అంటూ ట్వీట్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇప్పటికే నాగచైతన్య- సమంత ,ధనుష్ - ఐశ్వర్య  బ్యూటిఫుల్ కపుల్స్  గా గుర్తింపు తెచ్చుకొని విడాకులు తీసుకున్నారు. ఇక త్వరలోనే శ్రీజ - కళ్యాణ్ దేవ్ కూడా వివాహబంధానికి దూరం కాబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: