ఎన్టీఆర్ 30 : ఆమెని తప్పించారా లేక తప్పుకుందా .... ??

GVK Writings
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో ఒక భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక స్టూడెంట్ యూనియర్ లీడర్ గా కనిపించనున్నారని సమాచారం. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలపై ఎంతో భారీ వ్యయంతో నిర్మితం కానున్న ఈ సినిమా అధికారిక అనౌన్స్ మెంట్ కొన్ని నెలల క్రితమే వచ్చింది. వాస్తవానికి ఎన్టీఆర్ కెరీర్ 30వ సినిమాగా రూపొందనున్న ఈ సినిమా స్థానంలో త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ ఒక మూవీ చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వలన అది నిలిచిపోయింది.
అనంతరం దాని స్థానంలో అనౌన్స్ చేయబడ్డ ఈ మూవీకి సంబందించి ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఒక లేటెస్ట్ న్యూస్ విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా ఆర్ఆర్ఆర్ నటి అలియా భట్ ని ఫిక్స్ చేసారని, అలానే కోలీవుడ్ యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ దీనికి సంగీతం అందించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా స్టోరీ ని ఎన్టీఆర్ కి వినిపించి ఆమోదం అందుకున్న శివ, స్క్రిప్ట్ ని కూడా చివరి దశకు తీసుకువచ్చారని, అతి త్వరలో అది పూర్తి అయిన అనంతరం సినిమాని ఫిబ్రవరి రెండవ వారంలో అధికారికంగా లాంచ్ చేసి, ఆపైన మార్చి మొదటి వారంలో పట్టాలెక్కించేలా పక్కాగా ప్లాన్ ఫిక్స్ చేశారట. ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు పెరుగుదల కారణంగా మొదటి రెండు షెడ్యూల్స్ ని విదేశాల్లో చేయనున్నట్లు చెప్తున్నారు.
అయితే విషయం ఏమిటంటే కొన్ని నెలల క్రితం నుండి పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ మూవీలో హీరోయిన్ గా కియారా అద్వానిని ఎంపిక చేసారని ఆమెను అధికారికంగా అనౌన్స్ చేయడం లాంఛనమే అంటూ వార్తలు వచ్చాయి. అయితే హఠాత్తుగా ఆమె స్థానంలోకి అలియా భట్ రావడంతో కావాలనే కియారాని ఈ మూవీ నుండి తప్పించారా లేక ఆమే తప్పుకున్నారా అనే అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. కాగా పలువురు ఈ సినిమా యూనిట్ సభ్యులు వెల్లడించిన వివరాలను బట్టి ముందుగా కియారానే ఇందులో హీరోయిన్ గా తీసుకుందాం అని ఫిక్స్ అయిన యూనిట్, ఆమెకు వరుసగా ప్రాజక్ట్స్ ఉండడం, డేట్స్ అసలు ఖాళీ లేకపోవడంతో ఇటీవల ఆమె స్థానంలో అలియాని ఫిక్స్ చేయడం జరిగిందని సమాచారం. మరి ఇదే కనుక నిజం అయితే మరొక్కసారి ఎన్టీఆర్, కొరటాల కాంబోలో ఇంకొక బ్లాక్ బస్టర్ వస్తున్నట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: