ఆర్ ఆర్ ఆర్ తో పోటీ పెట్టుకుంటున్న సల్మాన్..

Purushottham Vinay
బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నుంచి ఎలాంటి సినిమాలు తెరపైకి తీసుకువచ్చిన కూడా బాక్సాఫీస్ వద్ద చాలా ఈజీగా భారీ వసూళ్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ ను ఈజీగా ఫినిష్ చేస్తూ ఉంటాయి.ఇక మినిమమ్ 300 కోట్ల వసూళ్ల టార్గెట్ తో సల్మాన్ ఖాన్ నుంచి సినిమా విడుదల అవుతుంది. ప్రతి సినిమా కూడా అతనికి మంచి లాభాలను అందిస్తూ ఉంటుంది. అందుకే సల్మాన్ ఖాన్ చాలాకాలం నుంచి కూడా పారితోషికం కాకుండా సినిమాకి వచ్చిన లాభాల్లో ఎక్కువ వాటాలు అడిగి తీసుకుంటున్నాడు. అంతేకాకుండా తన ప్రతి సినిమాకు కూడా సొంత ప్రొడక్షన్ ను యాడ్ చేస్తున్నాడు. అయితే సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీ పై కూడా చాలా ఫోకస్ చేస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా వారు డామినేషన్ అనేది చూపిస్తున్నారు.
దీంతో సల్మాన్ ఖాన్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాను మించే స్థాయిలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇక టైగర్ 3 సినిమాల్లో ఇద్దరు హీరోలను రంగంలోకి దింపుతున్నాడట సల్మాన్ ఖాన్.సల్మాన్ ఖాన్ తో పాటు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. అంతేకాకుండా ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ ను సంప్రదించినట్లు గా సమాచారం తెలుస్తోంది. ఆ ఇద్దరు హీరోలతో మంచి స్నేహం కలిగి ఉన్నాడు కాబట్టి వాళ్ళు అడిగిన వెంటనే ఒప్పేసుకున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాను కొట్టాలి అంటే టైగర్ 3 సినిమాతో అలా ప్లాన్ చెయ్యాలి అనుకుంటున్నాడు. ఇది కేవలం హిందీలోనే కాకుండా హిందీ తమిళ్ మలయాళం లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: