కొరటాల రివేంజ్.. ఆ సినిమాలలా కాదా!!

P.Nishanth Kumar
మిర్చి సినిమాతో తెలుగులో దర్శకుడిగా పరిచయమయ్యాడు కొరటాల శివ. అంతకుముందు రచయితగా పెద్ద సినిమాలకు పని చేసి దర్శకుల నమ్మకాన్ని పెద్ద హీరోల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ విధంగా తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని అగ్ర దర్శకుడిగా అవతరించి పెద్ద హీరోల కళ్ళల్లో పడ్డాడు కొరటాల శివ. ఆయన సినిమాలన్నీ కూడా కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలుగా కూడా ఉంటాయి. దాంతో ఒకసారిగా ఆయనకు డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది.

మహేష్ బాబు లాంటి హీరో ఆయనకు రెండు సార్లు సినిమా చేసే అవకాశం ఇచ్చాడు అంటే ఆయన లో ఎంతటి టాలెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ కూడా ఇప్పుడు రెండో అవకాశాన్ని ఆయనకు ఇవ్వడం విశేషం. తొలుత వీరిద్దరి కాంబినేషన్ లో జనతాగ్యారేజ్ అనే సినిమా రాగా అది ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీరి కాంబినేషన్లో మరో సినిమాను డిమాండ్ చేశారు ప్రేక్షకులు. వారి డిమాండ్ ఇంత త్వరగా ఫలిస్తుందని ఎవరు కూడా అనుకోలేదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో చేస్తున్న ఆచార్య సినిమా విడుదల తరువాత ఈ సినిమాను మొదలు పెట్టానున్నాడు కొరటాల శివ.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశాడు కొరటాల శివ. స్క్రిప్టును అంతా పూర్తి చేసి ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ కావడం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఓ రివేంజ్ డ్రామా అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో కమర్షియల్ కాన్సెప్ట్ ను జొడించి చేసే కొరటాల శివ తొలిసారి దాన్ని కాదని సరికొత్త పంథాలో సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ విధమైన ప్రయోగం చేస్తున్న కొరటాల శివ దీని ద్వారా ఏ విధమైన ఫలితాన్నీ అందుకుంటాడు అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: