అసంతృప్తి గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్, సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ నటనకు, అందచందాలకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. రకుల్ ప్రీత్ సింగ్ కేవలం తెలుగు భాష సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది, ఇది ఇలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది, తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ ఆఖరుగా నటించిన సినిమా కొండాపొలం ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించగా, ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించాడు, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఇలా హీరోయిన్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ పాన్ ఇండియా సినిమాల విషయంలో మాత్రం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది, ఇది ఇలా ఉంటే ఇటీవల ఈ ముద్దుగుమ్మ నేను తెలుగు..తమిళం..నా సొంత భాష హిందీ కూడా  మాట్లాడగలను. కాబట్టి తెలుగు దర్శకులు రాబోయే పాన్ ఇండియా చిత్రాల్లో అవకాశాలు కల్పిస్తారని.. మెయిన్ లీడ్ గా పరిగణించాలి అని రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా కోరింది, ఈ రకంగా రకుల్ ప్రీత్ సింగ్ తన మనసులో మాట బయట పెట్టింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ హిందీ లో సినిమాలు చేస్తోంది తెలుగులో ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం సినిమాలు లేవు. దీనిని బట్టి రకుల్ ప్రీత్ సింగ్ పాన్ ఇండియా హీరోయిన్ గా వెలిగిపోవాలన్న ప్లాన్ లో భాగంగానే హిందీలో క్రేజ్ సంపాదించాలని అక్కడి సినిమాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: