'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రభాస్ తరువాత పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. సినిమాకు మన దగ్గర ముందు కాస్త తేడా టాక్ వచ్చినా కాని తెలుగేతర రాష్ట్రాల్లో మాత్రం సినిమా అదరగొట్టేసింది అని సమాచారం.మలయాళంలో ఇప్పటికే బన్నీ అంటే బాగా పరిచయం ఉంది. కాబట్టి అక్కడ సినిమా వసూళ్లు బాగున్నాయి అనుకోవచ్చు. మిగిలిన కన్నడ, హిందీ ఇంకా తమిళంలో సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. వసూళ్లతోపాటు బన్నీకి సోషల్ మీడియాలోనూ హెల్ప్ అయ్యింది అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు.ఇన్స్టాగ్రామ్లో చాలా రోజులుగా అల్లు అర్జున్ ఇంకా విజయ్ దేవరకొండ మధ్య అప్రకటిత పోటీ జరుగుతోంది. 10 మిలియన్ల ఫాలోవర్ల దగ్గర నుండి ఈ పోటీ మొదలైంది అని చెప్పొచ్చు.
10.. 11.. 12.. 13.. 14 అంటూ వరుసగా ఇద్దరు హీరోలు ఫాలోవర్స్ పెంచుకుంటూ వస్తున్నారు. అలా మైలురాళ్లు దాటిన ప్రతిసారి ఇద్దరి హీరోల మధ్య గ్యాప్ ఒకటి, రెండు లక్షలు మాత్రమే ఉండేది. ఒక నెంబరు అల్లు అర్జున్ ముందు దాటితే, ఇంకో నెంబరు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముందు దాటాడు. మిగిలిన హీరో ఆ వెంటనే వచ్చేసేవాడు. అయితే 15 మిలియన్ల దగ్గరకి వచ్చేసరికి ఇక్కడ అంతా కూడా మారిపోయింది.దీంతో ఇద్దరు హీరోల ఇన్స్టా పోటీ అనేది బాగా రసవత్తరంగా మారింది. విజయ్ దేవరకొండ ఎప్పుడు 15 మిలియన్ల మార్కును దాటుతాడా అని అతని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 'లైగర్' సినిమా విడుదల ఉండుంటే ఆ నెంబరుకు చేరడం పెద్ద కష్టమయ్యేది కాదు. ఈలోపు అల్లు అర్జున్ కూడా తన పనిలో తాను ఉంటాడు కాబట్టి ఆ నెంబర్లు అనేవి ఇంకా పెరుగుతాయి. సో ప్రస్తుతానికి అల్లు అర్జున్ కి 'పుష్ప' ఇలా కూడా కలిసొచ్చింది అన్నమాట.పుష్ప వల్లనే బన్నీ నెంబర్ 1 హీరో అయ్యాడు.