నాగచైతన్యకి సమంత తర్వాత వారితోనే ఆ ఫీలింగ్ వస్తుందంటా..!!

N.ANJI
ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ నాగచైతన్య - సమంత నుంచి విడిపోయిన తర్వాత పలు ఇంటర్వ్యూలలో సమంత గురించి పాజిటివ్ గామాట్లాడుతున్న సంగతి అందరికి తెల్సిన విదితమే. ఇక ముఖ్యంగా బంగార్రాజు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగచైతన్య ఆన్ స్క్రీన్ బెస్ట్ జోడి ఎవరు అంటే అది కేవలం సమంత మాత్రమే అని చెప్పుకొచ్చాడు. అయితే మొన్నటి వరకు ఈ వార్త సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యింది. అంతేకాక.. విడాకులు ప్రకటించిన తర్వాత తామిద్దరం సంతోషంగానే ఉన్నామని నాగచైతన్య చెప్పుకొచ్చారు. కాగా.. సమంతతో విడిపోయినా కూడా విడాకుల వల్ల తమకు ఎలాంటి బాధ కలగలేదు అని చైతన్య చెప్పకనే చెప్పాడు.
అయితే  బాలీవుడ్ లోకి లాల్ సింగ్ చద్దా అనే సినిమా ద్వారా అడుగు పెడుతున్న సంగతి అందరికి తెల్సిందే..ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమాకు నాగచైతన్య పాత్ర చాలా ప్రధానమని తెలుస్తోంది. చై సమంతతో నటించినప్పుడు వచ్చే కంఫర్టబుల్ ఫీలింగ్ బాలీవుడ్ లో మరికొంత మంది హీరోయిన్లతో నటిస్తున్నప్పుడు మాత్రమే వస్తుంది అని వెల్లడించారు. నాగచైతన్యకి సమంత తరువాత ఆ కంఫర్టబుల్ ఫీలింగ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె, ఆలియాభట్ లతో మాత్రమే ఆ ఫీలింగ్ కలుగుతుందని వారు అంటే చాలా ఇష్టం అని చెప్పాడు.
అంతేకాదు.. చై తన ఇష్టాన్ని అయితే బయటపెట్టేశాడు. అయితే వారిద్దరూ నాగచైతన్యతో కలిసి నటిస్తారో లేదో చూడాలి మరి. నాగచైతన్య బాలీవుడ్లో  సక్సెస్ అయితే త్వరలోనే మరిన్ని పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. చైతన్య టాలీవూడ్ లో సినిమాలు చేస్తూనే ఇతర సినీ ఇండస్ట్రీల పై కూడా దృష్టి పెడుతూ.. కథ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంతో పోల్చుకుంటే నాగచైతన్య ఖాతాలో ప్రస్తుతం హిట్ల సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగిందనే చెప్పాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: