ఆర్ఆర్ఆర్ వాయిదా పడడంతో మహేష్ సినిమాపై పోకస్ పెట్టిన తండ్రికొడుకులు..!

Pulgam Srinivas
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్ లుగా అజయ్ దేవ్ గన్, సముద్ర ఖని ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్, ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మించారు, ఈ సినిమా నుండి ఇప్పటికే చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు అమాంతం పెంచేశాయి, ఇలా పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది. అయితే సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ప్రమోషన్ లను కూడా చేసింది, అయితే ఆ తర్వాత దేశంలో కరోనా కేసులు ఉధృతంగా పెరిగిపోవడంతో ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు,  ఇప్పటి వరకు ఈ సినిమా కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించలేదు. 

 అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన పనులు అన్నీ ముగిసిపోవడంతో అలాగే సెన్సార్ సర్టిఫికెట్ కూడా రావడంతో సరైన సమయం చూసి ఈ సినిమాని విడుదల చేసే ఆలోచనలో ఈ చిత్ర దర్శక, నిర్మాతలు ఉన్నారు. అయితే ఇప్పటికే ఆర్ఆర్ఆర్ పనులు అన్ని ముగిసిపోవడంతో రాజమౌళి మరియు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తమ తదుపరి చిత్రం అయిన మహేష్ బాబు సినిమా పనుల్లో బిజీగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి, మహేష్ బాబుతో ఎలాంటి సినిమా అయితే వర్కౌట్ అవుతుంది, ఎలాంటి కథ అయితే మహేష్ బాబు కు సూట్ అవుతుంది అనే చర్చలు వీరిద్దరు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇలా ఆర్ఆర్ఆర్ సినిమా కు సంబంధించిన పనులు అన్నీ ముగిసిపోవడంతో మహేష్ బాబు సినిమాపై ఈ తండ్రి కొడుకులు ఫోకస్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: