ఈసారి అమీర్ తో దూసుకొస్తున్న చైతూ.. ఎప్పుడంటే ?

Purushottham Vinay
నాగచైతన్య, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బంగార్రాజు. ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. సోలోగా వచ్చి ఈ సినిమా పండగ వసూళ్లను దండుకుంటోంది.ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య `లాల్ సింగ్ చద్దా` సినిమాతో డైరెక్ట్ గా హిందీ చిత్రసీమకు పరిచయం అవుతున్నాడు. అక్కడ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారని సమాచారం. ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఆంధ్రాకు చెందిన ఆర్మీ ఆఫీసర్ గా ఈ చిత్రంలో నాగచైతన్య కనిపించనున్నారు.లాల్ సింగ్ చద్దాకు అద్వైత్ చందన్ డైరెక్షన్ వహించగా.. ఎరిక్ రోత్ ఇంకా అతుల్ కులకర్ణి స్క్రీన్ ప్లే రాశారు. ఈ సినిమాని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ ఇంకా పారామౌంట్ పిక్చర్స్ నిర్మించాయి. విన్ స్టన్ గ్రూమ్ 1986 నవల ఆధారంగా 1994 వ సంవత్సరంలో వచ్చిన అమెరికన్ చలనచిత్రం ఫారెస్ట్ గంప్ కి రీమేక్ సినిమా ఇది. ఈ చిత్రంలో కరీనా కపూర్ ఓ హీరోయిన్.

ఫారెస్ట్ గంప్ అనుసరణ రెండు దశాబ్దాల వ్యవధిలో వరుస మార్పులకు గురవ్వడం జరిగింది. అతుల్ కులకర్ణి ఫస్ట్ పదేళ్లపాటు స్క్రిప్ట్ హక్కులను స్వీకరించి..ఇంకా మరో పదేళ్లు రీమేక్ హక్కులను కొనుగోలు చేశాడట. లాస్ ఏంజిల్స్ కు చెందిన ప్రొడ్యూసర్ ఇంకా దర్శకురాలు రాధికా చౌదరి సహాయంతో 2018 ప్రారంభంలో సినిమా హక్కులను కొనుగోలు చేసిన అమీర్ ఖాన్ 14 మార్చి 2019న దాని టైటిల్ తో ఈ సినిమాని ఆఫీషియల్ గా ప్రకటించారు.`లాల్ సింగ్ చద్దా`సినిమా 100 కంటే ఎక్కువ భారతీయ ప్రదేశాలలో చిత్రీకరించబడింది.

31 అక్టోబర్ 2019న చండీగఢ్ లో ఈ సినిమా షూట్ ప్రారంభమైంది. అయితే భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మార్చి 2020లో ప్రొడక్షన్ ఆపివేసారు. సెప్టెంబరు 2020 మధ్యలో ఢిల్లీలో మళ్ళీ ప్రారంభించారు. దీని కారణంగా ఈ సినిమా మొదట్లో క్రిస్మస్ 2020 విడుదలకు షెడ్యూల్ చేసినా కరోనా వైరస్ మహమ్మారి విడవక డేట్ మారింది. ఇక ఒక సంవత్సరం మొత్తం కూడా ఆలస్యమైంది. ఇప్పుడు 14 ఏప్రిల్ 2022న ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: