పుష్ప పార్ట్ 2 : రష్మిక వైరల్ కామెంట్స్..?

Purushottham Vinay
పుష్ప ది రైజ్ సినిమా అంచనాలకు మించి సక్సెస్ సాధించినా ఈ సినిమాలో కొన్ని తప్పులు అయితే ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను పుష్ప ది రైజ్ సినిమా ఆకట్టుకోలేదనే కామెంట్లు వినిపించాయి.అయితే కలెక్షన్ల విషయంలో పుష్ప ది రైజ్ నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లను ఇంకా బయ్యర్లను నిరాశపరచలేదు.ఇక పుష్ప ది రైజ్ సినిమాలో రష్మిక మందన్న, సునీల్, రావు రమేష్ ఇంకా అనసూయ పాత్రల నిడివి తక్కువగానే ఉండటం గమనార్హం. అయితే ఈ సినిమా గురించి తాజాగా రష్మిక మందన్నా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పుష్ప ది రైజ్ సినిమా ఒక మాస్ ఫీస్ట్ అని ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందని రష్మిక మందన అన్నారు. పుష్పరాజ్ ఫైర్ అనేది ఏ మాత్రం తగ్గలేదని రష్మిక మందన కామెంట్లు చేశారు.

ప్రస్తుతం అందరి దృష్టి పుష్ప ది రూల్ సినిమాపై ఉందని రష్మిక చెప్పుకొచ్చారు. పుష్ప ది రూల్ సినిమా మరింత బెటర్ గా ఇంకా మరింత బిగ్గర్ గా ఉంటుందని రష్మిక కామెంట్లు చేశారు. రష్మిక మందన చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. పుష్ప ది రూల్ కూడా అంచనాలను మించి మంచి విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.సుకుమార్ రెండో పార్టులో ఆసక్తికర ట్విస్టులు ఉండేలా జాగ్రత్త పడుతున్నారని సమాచారం తెలుస్తుంది. సుకుమార్ ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమా పనులతో బిజీగా ఉన్నారు.

మొదటి పార్ట్ కనిపించని మూడు పాత్రలు పుష్ప ది రూల్ లో కనిపిస్తాయని సమాచారం తెలుస్తుంది. కేశవ పాత్రతో సుకుమార్ మంచి షాకింగ్ ట్విస్ట్ ను ప్లాన్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తెలుగు సినిమాలలో ఒక్క బాహుబలి మినహా ఫస్ట్ పార్ట్ సక్సెస్ సాధించనంతగా రెండో పార్ట్ సక్సెస్ సాధించిన సినిమాలు అనేవి ఎక్కువగా లేవు.అయితే పుష్ప ది రూల్ సినిమాతో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఆ నెగిటివ్ సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేస్తాడో లేదో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: