దిల్ రాజుకి అర్జున్ రెడ్డి చూపించనన్నారా..?

shami
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్.. డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు అర్జున్ రెడ్డి సినిమా విషయంలో తనకు జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ని షేర్ చేసుకున్నారు. ఆయన నిర్మాతగా తన సోదరుడు తనయుడు ఆశిష్ హీరోగా వస్తున్న రౌడీ బోయ్స్ ప్రమోషన్స్ లో తనకు అర్జున్ రెడ్డి సినిమా డైరక్టర్ సందీప్ వంగ ఆ సినిమా చూపించనని చెప్పాడని అన్నారు. మీరు అన్ని ఫ్యామిలీ సినిమాలు చేస్తారు.. అలాంటి సినిమాలే ఇష్టపడతారు. అర్జున్ రెడ్డి మీకు చూపించనని అన్నాడట సందీ వంగ. తమ బ్యానర్ లో సినిమా అంటే ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా అవుతుందని. అయితే వారసుడి కోసం ఆ గీత చెరిపేశాం అంటున్నారు దిల్ రాజు.
ఎప్పుడూ తన సినిమాలను ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసే సినిమా అని చెబుతానని కానీ రౌడీ బోయ్స్ మాత్రం కేవలం యూత్ ఆడియెన్స్ కోసమే అని అంటున్నారు దిల్ రాజు. ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఉంటాయని. కథకి అవసరం అనిపించే అలా చేశామని అన్నారు. తనకు నచ్చదని సందీప్ వంగ అర్జున్ రెడ్డి సినిమా చూపించనని అన్నాడు. అదే విషయాన్ని గుర్తు చేస్తూ రౌడీ బోయ్స్ కూడా అదే తరహా ఇంటెన్స్ లవ్ స్టోరీతో వస్తుందని. యూత్ ఆడియెన్స్ మీచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని అన్నారు దిల్ రాజు.
ఆశిష్ రెడ్డి, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన రౌడీ బోయ్స్ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై బజ్ బాగానే క్రియేట్ అయ్యింది. తప్పకుండా యువతని మెప్పించేలా ఈ సినిమా సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. హర్ష డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కించారు. దిల్ రాజు బ్రాండ్ తో భారీగా వస్తున్న ఈ రౌడీ బోయ్స్ నిజంగానే ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: