గుడ్ న్యూస్ చెప్పిన షణ్ముఖ్ ఫాదర్..ఇది కదా ఫ్యాన్స్ కు కావాల్సింది..!!

VUYYURU SUBHASH

గత రెండు వారాల నుండి సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉన్న వార్త ఏదైన ఉంది అంటే అది ఖచ్చితంగా షణ్ముఖ్ జశ్వంత్ - దీప్తి సునైనా కు సంబంధించినవే. ఒకటి కాదు రెండు కాదు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు దాదాపు కొన్ని వందల వీడియోలు వేల కామెంట్లు వీళ్లకి సంబంధించినవే  కనిపిస్తున్నాయి. కొందరు విడిపోయి మంచి పని చేసారు అంటూ కామెంట్స్ పెడుతుంటే మరికొందరు ప్లీజ్ ఇలాంటి డెసిషన్ తీసుకోకండి .. మీరు ఇద్దరు మళ్లీ కలవండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ అయితే షణ్ముఖ్-దీప్తి సోషల్ మీడియా అకౌంట్లనే ఫాలో అవుతూ..వాళ్లు పెట్టిన ప్రతి పోస్ట్ ను క్షణాల్లో వైరల్ చేస్తున్నారు. అస్సలు వాళ్ల ఇద్దరు ఏం ఊహించి పోస్ట్లు పెట్టిన ఈ పోస్ట్ షణ్ముఖ్ కి కౌంటర్ ఇవ్వడానికే పెట్టిన దీప్తీ అంటూ .. దీప్తీ కి దిమ్మతిరిగే షాకిచ్చిన షన్నూ అంటూ బ్రేకప్ తరువాత వాళ్లకు సంబంధించిన ప్రతి పోస్ట్ ను హైలెట్ చేస్తున్నారు. దీంతో కొంతమంది నెటిజన్స్ కి యూట్యూబ్ ఓపెన్ చేయాలి అంటేనే చిరాకు వస్తుంది.
ఇక ఇలాంటి సమయంలో  షణ్ముఖ్ అభిమానులకి పండగ  చేసుకునే లాంటి వార్త చెప్పారు ఆయన తండ్రి. రీసెంట్ గా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యులో ఆయన మాట్లాడుతూ.."షణ్ముఖ్-దీప్తి మళ్లీ కలుస్తారు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. దయచేసి వాళ్లని కొన్ని రోజులు ప్రశాంతంగా వదిలేయండి. ఇద్దరు కెరీర్ మీదా ఫోకస్ చేస్తున్నారు. టైం వచ్చిన్నప్పుడు ఖచ్చితంగా వాళ్లు కలుస్తారు. అభిమానులు బాధపడకండి"..అంటూ చెప్పుకొచ్చారు. దీంతో షన్నూ దీప్తి కలవాలని కోరుకునే వాళ్లు ఇది  నిజంగా మాకు  గుడ్ న్యూస్  అంకుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ప్రస్తుతం షన్నూ ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: