బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ కు రంగం సిద్ధం!!

P.Nishanth Kumar
నందమూరి బాలకృష్ణ ఇటీవలే అఖండ సినిమాతో మంచి సక్సెస్ సాధించాడు. ఈ సినిమా విజయోత్సాహం ఆయన లో ఆయన అభిమానులలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. ఇపుడు ఆయన తదుపరి చిత్రం పైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు.  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ మాస్ మసాలా చిత్రాన్ని చేస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ మాస్ మసాలా చిత్రం ను ఇదివరకే అధికారికంగా ప్రకటించగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది.

వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇక మొదటి నుంచి బాలకృష్ణ తన సినిమాలను ఎంతో అద్భుతంగా ఉండేలా చూసుకుంటాడు. అయితే వాటిలో కొన్ని ఫ్లాప్ లుగా నిలిచాయి. అయితే గత కొన్ని సినిమాలు గా ఆయన ప్రేక్షకులు మెచ్చే సినిమా లే చేస్తుండడం ఇప్పుడు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఇక గోపీచంద్ మలినేని సినిమాలో బాలకృష్ణ సరికొత్త మాస్ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నాడని సమాచారం. ఇకపోతే బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్టులుగా కొన్ని సినిమాలను పెట్టుకున్నాడు.

వాటిలో ఒకటి తన తండ్రి బయోపిక్ కాగా ఆ కలను నెరవేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఎప్పటినుంచో శంకరాచార్య అనే పాత్రను పోషించాలని అనుకుంటున్నారు. భారతదేశ చరిత్రలో హైందవ ధర్మాన్ని ప్రచారం చేసిన తత్వవేత్తగా వేదాంత వేత్తగా శంకరాచార్య కు మంచి పేరు ఉంది. అటువంటి గొప్ప వ్యక్తి జీవితాన్ని తెరపైకి చూపించారని బాలకృష్ణ గతంలో ప్రయత్నాలు చేయగా అది పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధం అంటూ నిర్మాత సి.కళ్యాణ్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ శంకరాచార్య సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ప్రిపేర్ అవుతుంది అది అని ఆయన కు నచ్చితే నంచేయడమే అని వెల్లడించారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ విషయంలో ఎలాగైనా జాగ్రత్తలు తీసుకుంటాడు బాలయ్య మరి కళ్యాణ్ తన కథతో బాలకృష్ణ ను ఒప్పిస్తాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: