మెగాస్టార్ కు తప్పని సినిమా తిప్పలు.. !!

P.Nishanth Kumar
ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఇబ్బందులు తలెత్తడం ఎక్కువగా జరుగుతున్నాయి. పెద్ద సినిమాలకు సైతం ఈ విధమైన సమస్యలు రావడం మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏదైనా కానీ ఈ విధంగా పెద్ద సినిమాలకు ఇబ్బందులు వస్తే మధ్యలో ఆ సినిమాలే ఆగిపోయిన సందర్భాలు కోకొల్లలు. అలా తాజాగా మెగా స్టార్ హీరోగా నటిస్తున్న సినిమాలకి కూడా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ఆయన హీరోగా ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి రెండవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతు ఉండగా ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి గాడ్ ఫాదర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం మోహన్ లాల్ మలయాళం లో నటించిన లూసిఫర్ చిత్రానికి రీమేక్ అన్న విషయం అందరికీ తెలిసిందే. మొదట ఈ చిత్రానికి సుజిత్ మరియు వివి వినాయక్ లను దర్శకులుగా ఎంచుకోగా వారు తమ పనితనంతో మెగాస్టార్ మెప్పించలేకపోయారు. 

దాంతో ఈ అవకాశం మోహన్ రాజా కు దక్కింది. ఆయన ఒకే ఒక సిట్టింగ్ లో ఈ సినిమా ను ఒకే చేసుకొని ఇప్పుడు షూటింగ్ దశలో కి తీసుకు వచ్చాడు. అయితే తమిళ దర్శకుడు కావడం వలన తెలుగులో బాగా అనుభవం ఉన్న రచయిత లక్ష్మీ భూపాల్ ను సినిమాకి రచయితగా ఏర్పాటు చేశారు. అయితే కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది దాంతో హడావుడిగా మరొక రచయిత బుర్ర సాయి మాధవ్ ను రంగం లోకి దించారట చిరంజీవి. ఆయన హీరోగా చేసిన సైరా సినిమాకి అద్భుతమైన సంభాషణలు అందించిన సాయిమాధవ్ ఈ సినిమాకి ఎలాంటి సంభాషణలు అందిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: