'పుష్ప' నైజాం రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత.. ఎంతకంటే..?

Anilkumar
దిల్ రాజు గత కొంత కాలంగా డిస్ట్రిబ్యూటర్ గా కాకుండా నిర్మాతగా భారీ చిత్రాలతో బిజీ అవుతున్నాడు. అయితే బిజినెస్ పరంగా కొంతకాలంగా ఈయన వైపు కి వ్యతిరేక పవనాలు వీచాయి. కానీ అది ఎంతో కాలం ఉండలేదు ప్రస్తుతం దిల్ రాజు పెద్ద పెద్ద సినిమాలతో చాలా బిజీ అయ్యాడు. ప్రస్తుతానికి ఆర్ ఆర్ ఆర్, భీమ్లానాయక్, రాధేశ్యామ్ చిత్రాల నైజాం రైట్స్  ఆయన చేతిలోనే ఉండడం విశేషం. అయితే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా నైజాం రేటు కూడా దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ కీలక పాత్ర పోషించిన ఈ హిట్ సినిమా హక్కులను కూడా తనే సొంతం చేసుకున్నట్లు గా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వార్తలు వస్తున్నాయి.

 అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ పుష్ప సినిమా నైజాం హక్కులను దిల్ రాజు 36కోట్లకు దక్కించుకున్నట్లు గా తెలుస్తోంది. అయితే మొదట మాత్రం 45 కోట్లు అని చెప్పిన మైత్రి మూవీస్ ఆకరికి 36 కోట్ల కు దిగి వచ్చినట్లు గా సమాచారం. పదిన్నర  కోట్లకు అఖండ సినిమా నైజాం హక్కులను సొంతం చేసుకున్న దిల్ రాజు మంచి బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. బిజినెస్ చేయడమే కాకుండా అందులో మంచి లాభాన్ని పొందారు దిల్ రాజు. ఈ రెండూ పెద్ద సినిమాలే కాకుండా ఇంకా ఇలాంటి ఎన్నో సినిమాల పై దిల్ రాజు కన్నేసినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే అల్లు అర్జున్ పుష్ప సినిమా ప్రమోషన్స్ మాత్రం శరవేగంగా సాగుతున్నాయి.

సినిమా విడుదల దగ్గరికి రావడంతో  సినిమా పబ్లిసిటీ పనులు లు ఇంకా వేగంగా పూర్తి చేస్తున్నారు. రోజుకు ఒక కొత్త లుక్ తో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటున్నారు. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్ ఈ ట్రైలర్ లో కొన్ని సీన్స్ ప్రేక్షకులను పిచ్చెక్కించే విధంగా ఉన్నాయి. ఈ సినిమా మా డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో సమంత ఒక స్పెషల్ సాంగ్ చేయనున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: