ఆ విషయంలో టెన్షన్ పడుతున్న నాగార్జున..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరో గా రమ్యకృష్ణ హీరోయిన్ గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా సోగ్గాడే చిన్ని నాయన, ఈ సినిమా 2016 సంక్రాంతి కానుక గా విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడం తో ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా ను తెరకెక్కిస్తున్నారు, ఈ సినిమాలో కూడా టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరో గా నటిస్తూ ఉండగా, నాగార్జున సరసన రమ్య కృష్ణ హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగవచైతన్య కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు, ఈ సినిమా లో నాగ చైతన్య కు జంట గా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా కు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు, అయితే ఈ సినిమా నిర్మాణం విషయం లో అనుకున్న దాన్ని మించి బడ్జెట్ ఖర్చవుతోందని, దీంతో నాగార్జున కాస్త టెన్షన్ పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణ లో తెరకెక్కుతున్న ఈ మూవీ ని జీ స్టూడియోస్ వారు నిర్మిస్తున్నారు. అయితే ఈ మూ వీ బడ్జెట్ రేంజ్ దాటిపోయిందని తెలుస్తోంది. నిజానికి బంగార్రాజు సినిమా  నటీనటు ల రెమ్యూనరేషన్ తో కలుపు కొని 30 కోట్ల లోపు సినిమాను పూర్తి చేయాలి అని అనుకున్నారట, కానీ ఇప్పటి వరకు బంగార్రాజు సినిమాకు 45 కోట్ల వరకు ఖర్చు పెట్టారు అని సమాచారం. అయిన ప్పటికీ బంగార్రాజు సినిమా నిర్మాణ సంస్థలు  ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదట, సినిమా కంటెంట్ పై ఉన్న నమ్మకం తో ఖర్చు విషయం లో నిర్మాణ సంస్థలు ఏ మాత్రం వెనకాడడం లేదట, కాక పోతే నాగార్జున మాత్రం లో లోపల కాస్త టెన్షన్ పడుతున్నారు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: