భయపెడుతున్న అనసూయ లుక్.. ప్రేక్షకులు షాక్?

praveen
జబర్దస్త్ యాంకర్ అనసూయ.. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే. జబర్దస్త్ అనే ఒక సాదాసీదా కామెడీ షో లో యాంకర్ గా ప్రత్యక్షమైంది అనసూయ. ఇక జబర్దస్త్ షో పాపులారిటీ సంపాదించడంతో ఈమెకు కూడా ఒక్కసారిగా క్రేజ్ వచ్చింది. దీంతో తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితులే గా మారిపోయింది అనసూయ. అయితే జబర్దస్త్ కార్యక్రమం తో అంతకంతకు క్రేజ్ సంపాదించి అక్కడితో ఆగలేదు. వెండితెరపై కనిపించాలి అన్న తన ఆశను నెరవేర్చుకునేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది.

 తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల సినిమాల్లో ఎన్నో కీలక పాత్రల్లో నటిస్తూ వస్తుంది అనసూయ. సుకుమార్ రామ్చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించిన అనసూయ ఇక తెలుగు ప్రేక్షకులందరికీ రంగమ్మత్త గా మారిపోయింది. వైవిధ్యమైన పాత్రలను ఎంతో ఛాలెంజింగ్గా తీసుకుని అనసూయ తన నటనతో పాత్రల్లో ఒదిగిపోయి నటిస్తూ  ఉంటుంది. ఇప్పటి వరకు అనసూయ చేసిన ప్రతీ పాత్రకు కూడా విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు మరోసారి సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో మరో వైవిధ్యమైన పాత్రలో నటిస్తుంది అనసూయ.

 దాక్షాయణి అనే పాత్రలో నటిస్తుంది అన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే అనసూయ పాత్రకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వామ్మో అనసూయ ఇంత భయంకరంగా ఉందేంటి అనుకున్నారు అందరు. ఇక ఇటీవల పుష్ప ట్రైలర్ కు సంబంధించి విడుదలైన గ్లింప్స్ లో కూడా అనసూయ ఎంతో భయంకరం గా కనిపించింది. ఇక ఇటీవల విడుదలైన లుక్ లో ప్రేక్షకులను అనసూయ మరింత భయపెడుతుంది. ఒంటిపై కొంగు లేకుండా నోట్లో బ్లేడుతో మంచం పై పడుకొని ఒక వ్యక్తి ని చంపుతున్నట్లు అనసూయ కనిపిస్తోంది. ఇక ఈ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. రంగమ్మత్త కంటే దాక్షాయిని పాత్ర అనసూయకు  మంచి గుర్తింపు తెచ్చి పెడుతుంది అంటున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: