'అఖండ' సినిమా చూస్తూ మరణించిన బాలయ్య అభిమాని, సినీ డిస్ట్రిబ్యూటర్.. కారణం..?

Anilkumar
టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ గత కొంతకాలంగా వరుస ఫ్లాపులను చవి చూస్తూ వస్తున్నాడు.గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తర్వాత బాలయ్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలోనే బోయపాటి శ్రీను తో చేతులు కలిపి 'అఖండ' అనే హై వోల్టేజ్ యాక్షన్ సినిమా చేశాడు. డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ తో దూసుకుపోతోంది. బాలయ్య ఫ్యాన్స్ అంతా థియేటర్ల వద్ద పండగ చేసుకుంటున్నారు ఈ సినిమాతో. థియేటర్లలో ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డు లే కనిపిస్తున్నాయి. విదేశాల్లో కూడా అఖండ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది.

 ఇలాంటి ఆనందకరమైన సమయంలో బాలయ్య అభిమాని ఒకరు హఠాన్మరణం చెందడం ఒక్కసారిగా అందరినీ షాక్కు గురి చేసింది. అది కూడా అఖండ సినిమా చూస్తూ ఆ అభిమాని మరణించడం బాలయ్య అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.ఇక ఆ వివరాల్లోకి వెళితే... తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సిరి ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలయ్యకు అభిమాని అయిన జాస్తి రామకృష్ణ శ్యామల థియేటర్లో అఖండ సినిమాను చూస్తుండగానే హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ కి గురై ప్రాణాలు విడిచాడు. ఈ ఈ నేపథ్యంలోనే  శ్యామల థియేటర్ యాజమాన్యం అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది.

హాస్పటల్కి తీసుకెళ్ళే లోపే రామకృష్ణ మరణించాడు. ఇక రాజమండ్రి సమీపంలో ఉన్న నామవరం వీఎస్‌ మహల్‌ థియేటర్‌ ఓనర్ గా తన కెరీర్ను ప్రారంభించి ఆ తర్వాత జిల్లా సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, వింటేజ్ క్రియేషన్స్ అధినేతగా ఎదిగాడు. అంతే కాదు అక్కడ ఇక్కడి పాపులర్ జెకె రెస్టారెంట్ కి కూడా అధినేత ఈయనే. ఇక రామకృష్ణ భార్య పేరు శిరీష. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 'అఖండ' సినిమా విడుదలయ్యే ప్రపంచవ్యాప్తంగా బాలయ్య అభిమానులను ఆకట్టుకుంటున్న సమయంలో ఇలాంటి ఒక సంఘటన జరగడం అభిమానుల్ని కలిసి వేసింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: