అలా అదరగొడుతున్న కియారా అద్వానీ..!

Pulgam Srinivas
హాట్ బ్యూటీ కియారా అద్వానీ ధోని అన్ టోల్డ్ స్టోరీ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మకు బాలీవుడ్ తో సహా ఇతర భాషల నుండి కూడా మంచి ఆఫర్లు వచ్చాయి. అందులో భాగంగా టాలీవుడ్ వైపు అడుగులు వేసిన ఈ హాట్ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ వెంటనే మెగా స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమాలో హీరోయిన్ గా నటించింది.  ఇలా వెంట వెంటనే ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించిన ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ వైపు తన ఫోకస్ పెట్టింది, ఇలా బాలీవుడ్ వైపు తన దృష్టిని మళ్లించిన కియారా అద్వానీ బాలీవుడ్ సినిమాల ద్వారా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా పార్ట్  ఇండియా క్రేజ్ ఉన్న దర్శకుడు శంకర్ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాత గా తెరకెక్కుతున్న సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతోంది. ఇలా ఫుల్ క్రేజ్ ఉన్న సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా లో కూడా అంతే ఆక్టివ్ గా ఉంటూ తన అభిమాను లతో అనేక విషయాలను పంచుకుంటుంది, ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసే కియారా అద్వానీ తాజా గా కూడా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ హాట్ బ్యూటీ పసుపు రంగు డ్రెస్ ను ధరించి అదిరిపోయే లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం కియారా అద్వాని కి సంబంధించి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: