ఒక సక్సెస్.. ఒక ఫెయిల్యూర్ మరి నెక్స్ట్ ఏంటి..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు, మెగా మేనల్లుడు గా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో తన మొదటి సినిమా తోనే వంద కోట్ల మార్క్ ని టచ్ చేసి తెలుగు ఇండస్ట్రీ లో ఒక కొత్త రికార్డును సృష్టించాడు. ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా, బుచ్చిబాబు తన ఈ సినిమా కు దర్శకత్వం వహించాడు. కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త దర్శకుడు అయినప్పటికీ ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ ఖర్చుతో తెరకెక్కించారు. ఇలా మొదటి సినిమా విడుదల కాకముందే ఈ సినిమా నుండి విడుదలైన పాటల ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈ సినిమా విడుదల తరువాత కూడా అదే రేంజ్ లో ప్రజల దగ్గర నుండి రెస్పాన్స్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది.

 ఇలా మొదటి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో పంజా వైష్ణవ్ తేజ్ రెండవ సినిమా పై జనాలు మంచి అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగినట్టు గానే పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తెలుగు విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కిన కొండా పొలం సినిమాలో హీరో గా  నటించాడు. ఈ సినిమా కొండ పొలం అనే నవల ఆధారంగా పెరగడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి, కాకపోతే ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పాలైంది. ఇలా మొదటి సినిమా తో మంచి విజయం అందుకున్న ఈ హీరో తన రెండవ సినిమా తో మాత్రం ఆరెంజ్ విజయాన్ని అందుకోలేకపోయాడు, మరి ఈ హీరో తదుపరి సినిమా తో ఎలాంటి విజయాన్ని అనుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: