టాలీవుడ్ బాకీలు పెరిగిపోతున్నాయి....?

Satya
టాలీవుడ్ లో లిస్ట్ అంతకంతకు పెరిగిపోతోంది. దాంతో పాటు అటు మేకర్స్ లో టెన్షన్ స్టార్ట్ అయితే ఇటు ఫ్యాన్స్ లో కూడా అసంతృప్తి పెరిగిపోతోంది. ఇంతకీ టాలీవుడ్ లో ఏం జరుగుతోంది. ఎందుకు ఇలా జరుగుతోంది అన్న చర్చ అయితే ఉంది.
దీనికి సమాధానం చెప్పుకోవాలీ అంటే ముందు టాలీవుడ్ లో సెట్స్ మీద ఉన్న మూవీస్, కంప్లీట్ అయిన మూవీస్ ని ఒక్కసారి లిస్ట్ చేసి చూడాలి. టాలీవుడ్ లో ఆచార్య మూవీ ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు. ఇక మెగాస్టార్ వరసబెట్టి మూడు నాలుగు ప్రాజెక్టులను ఓకే చేశారు. రెండు మూవీస్ షూటింగ్ ని సైమల్టేనియస్ గా స్టార్ట్ చేశారు.
అయినా సరే మెగా స్టార్ ఆచార్య బాకీ అలాగే ఉంది. ఆ మొక్కు తీర్చి లెక్క  తేల్చమని ఫ్యాన్స్ గోల పెడుతున్నారు. మాకు బ్లాక్ బస్టర్ కావాలీ అంటున్నారు. ప్రభాస్ విషయం తీసుకున్నా అంతే మూడేళ్ళు కావస్తున్నా కొత్త సినిమా రిలీజ్ చేయలేకపోతున్నారు. ఎట్టకేలకు రాధేశ్యామ్ అంటూ కొత్త ఏడాది థిఎయేటర్ల తలుపు తడుతున్నాడు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ కావాలని, బాహుబలిని మించాలని, అలా అయితేనే తమ బాకీ తీరినట్లు అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.
ఇక జూనియర్ ఎన్టీయార్ కూడా మూడేళ్ళుగా కొత్త సినిమా రిలీజ్ చేయలేదు. ట్రిపుల్ ఆర్ తో ఆకలి తీరుస్తావా జూనియర్ అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఇదే తీరున రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉన్నారు. వారి ఆశలన్నీ ట్రిపుల్ ఆర్ ఆచార్య మీద ఉన్నాయి. ఇక అల వైకుంఠపురంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ రెండేళ్ల తరువాత పుష్ప అంటూ దూసుకువస్తున్నాడు. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని, అల వైకుంఠపురం మూవీని మించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఇలా ఫ్యాన్స్ ఆశలు చాలా ఉన్నాయి. అలాగే మేకర్స్ విషయం తీసుకుంటే సినిమాలు రెడీ అయి రిలీజ్ కావాల్సినవి ఉన్నాయి. అలాగే కొన్ని సెట్స్ మీద ఉన్నాయి. ఇవన్నీ రిలీజ్ అయి ఒకదాని తరువాత ఒకటి సక్సెస్ అయితేనే తమ బాకీలు మొత్తం తీరినట్లు అని భావిస్తున్నారు. సో టాలీవుడ్ పెద్ద బాకీనే పడిపోయినట్లు లెక్క.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: