బంతి తగలడంతో 25 కుట్లు పడ్డాయి...షాహిద్ కపూర్..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని హీరో గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా జెర్సీ, క్రికెట్ ప్రధాన నేపథ్యం గా తెరకెక్కిన ఈ సినిమా నాని కెరియర్ లో ఎంత మంచి విజయంగా నిలిచింది మన అందరికీ తెలిసిందే. అలాగే దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కి కూడా ఇది ఒక గొప్ప సినిమాగా పేరు తెచ్చిపెట్టింది. జెర్సీ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత గానో అలరించడం మాత్రమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఇలా ఎంతో మంది మనసు దోచుకున్న ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరో గా తెరకెక్కిస్తున్నాడు, తాజా గా జెర్సీ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయగా, దీని కి జనాల నుండి అదిరి పోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమా పై ఉన్న అంచనాలను కూడా అమాంతం పెంచేశాయి, ఇలా ఇప్పటికే జనా లలో మంచి అంచనాలను క్రియేట్ చేసిన  జెర్సీ సినిమా 31 డిసెంబర్ 2021 వ తేదీ న థియేటర్ లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

అయితే ఈ సిని మా విడుదల తేదీ దగ్గర పడటం తో ఈ చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ పెంచారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా షాహిద్ కపూర్ మాట్లాడుతూ.. జెర్సీ సినిమా కోసం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండ గా పెదవికి గాయమై 25 కుట్లు పడినట్లుగా తెలియ జేశాడు. ఇప్పటికే తెలుగు లో విడుద లై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలి చిన జెర్సీ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో తెలియాలి అంటే ఈ సినిమా విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: