కేజిఎఫ్ 2 మళ్లీ వాయిదా అవే కారణాలు..!

Pulgam Srinivas
రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కేజిఎఫ్, ఈ సినిమా విడుదలకు ముందు జనాలలో పెద్దగా ఆసక్తి లేకపోయినా విడుదల తర్వాత మాత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది. పాన్ ఇండియా సినిమా గా  విడుదలైన కేజిఎఫ్ విడుదలైన ప్రతి భాషలోనూ అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో  హీరోకు పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ ఎలా వచ్చిందో, ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ కు కూడా అదే రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ చాప్టర్ వన్ తో వచ్చిన క్రేజ్ తో ప్రభాస్ హీరోగా సలార్ సినిమాను చేస్తూ మరి కొన్ని సినిమాలను కూడా లైన్ లో పెట్టుకున్నాడు. అయితే కేజిఎఫ్ చాప్టర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో  కేజిఎఫ్ చాప్టర్ టు కు ఇండియా రేంజ్ లో ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి.

అయితే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కారోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది, అయితే కొంత కాలం క్రితం ఈ సినిమా ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే ప్రస్తుతం కూడా ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది, దానికి ప్రధాన కారణం ఈ సినిమాకు సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను రీషూట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కోసం కూడా మరి కొంత సమయం పడుతుంది అని తెలుస్తోంది. అలా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రశాంత్ నీల్  ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: