అందరి ముందే షణ్ముఖ్ ని అంత మాట అనేసిన సిరి తల్లి..ఫ్యాన్స్ ఏమంటున్నారో తెలుసా..?

VUYYURU SUBHASH
తెలుగులోనే అతి పెద్ద రియాలిటీ షో గా స్టార్ట్ అయిన బిగ్‌బాస్.. ఇప్పటికే నాలుగు సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇక ఐదవ సీజన్ కూడా మరి కొద్ది రోజుల్లో ముగియనుంది. యస్..తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 రియాలిటీ షో ముగింపు దశకు వచ్చేసింది. ఫైనల్స్ దగ్గరపడడంతో బిగ్ బాస్ హౌస్ లో హీట్ పెరిగింది. మొదట నుండే గొడవలతో సాగిపోతున్న ఇంట్లో నామినేషన్ ప్రక్రియ మాత్రం కంటెస్టెంట్ మధ్య కాక రేపుతుంది. ఇక ఈ సీజన్ కి బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ గా షణ్ముఖ్ ని ఎన్నుకున్నారు ఇంటి సభ్యులు.
మరో నాలుగు వారాలపాటు కొనసాగే ఈ షో లో ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ఇంటి సభ్యుల వాళ్ల ఇంట్లోని వారు వస్తున్నారు. ప్రతి సీజన్ లో ఈ ఎపిసోడ్ మాత్రం అందరిని హత్తుకుంటుంది. ఇక ఈ క్రమంలో మొదట కాజల్ కు సంబంధించి వాళ్ళ శ్రీవారు, పాప వచ్చారు. ఇక ఈ రోజు హౌస్ లోకి మానస్ వాళ్ల అమ్మగారు, సిరి వాళ్ళ అమ్మగారు రావడం మనం ప్రోమోలో చూడవచ్చు. మానస్ వాళ్ళ అమ్మ హౌస్ లోకి ఎంటర్ అవ్వగానే హౌస్ మొత్తం ఫుల్ సందడి సందడిగా కనిపిస్తుంది. అందరితో సరదాగా ఉంటూ బాగా ఫన్నీ మూడ్ ని తీసుకొచ్చిందనే చెప్పాలి.
ఇక సిరి వాళ్ల అమ్మగారు వచ్చాక సిరి బాగా ఎమోషన్ అవుతూ అమ్మ అని ఏడుస్తూ వెళ్లి అమ్మెను హత్తుకుంటుంది. ఇక వాళ్ల అమ్మగారు కూడా సిరి నువ్వు ఆట బాగా ఆడుతున్నావ్ కానీ నువ్వు షణ్ముఖ్ అలా ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం నాకు నచ్చలేదు అని మొహానే చెప్పేస్తుంది. దీంతో షణ్ముఖ్ చాలా ఫీల్ అవుతాడు. నిజానికి సిరి వాళ్ల అమ్మగారు చెప్పిందే కరెక్ట్ అని అంటున్నారు నెటిజన్స్. షో లో వాళ్లు చేసే రొమాన్స్ మితిమీరుతుంది అని అంటున్నారు. ఎంతైన తల్లికదా ఆమెకు ఆ బాధ ఉంటుంది అందుకే అలా ఫేస్ మీదనే చెప్పేసింది. ఇకనుండి అయిన బుద్ధి తెచ్చుకోండి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ విషయం పై షణ్ముఖ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. షన్ను చాలా సార్లు దూరంగా ఉండూ అని చెప్పినా సిరినే దగ్గరకు వచ్చి కౌగిలించుకుని, ముద్దులు పెడుతుంది అంటూ  రీవర్స్ కౌంటర్ లు ఇస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: